పల్లె నుంచి అసెంబ్లీకి
సర్పంచ్గిరి.. ఎమ్మెల్యేగా గురి మంత్రులైన సర్పంచులు పల్లె నుంచే రాజకీయ తెరంగేట్రం రాజకీయ దురందరులు తొలుత సర్పంచులే..
సర్పంచ్లుగా మొదలై..
వార్డు సభ్యుడిగా తొలి అడుగు
రాజన్నసిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేటకు చెందిన కటుకం మృత్యుంజయం 1981లో తొలిసారి గంభీరావుపేట వార్డుసభ్యుడిగా ఎన్నికయ్యారు. 1983లో కరీంనగర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు.
తండ్రీతనయులు సర్పంచులే
హుజూరాబాద్ ప్రాంతానికి చెందిన మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతారావు 1981 నుంచి 1994 వరకు సింగాపూర్ గ్రామ సర్పంచ్గా పనిచేశారు. 2004లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొంది 2006లో మంత్రిగా ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. ఆయన తనయుడు హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ 1995 నుంచి 2001 వరకు సింగాపూర్ సర్పంచ్గా పనిచేశారు. 2014, 2018 ఎన్నికల్లోనూ హుస్నాబాద్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
సిరిసిల్ల: ఉమ్మడి జిల్లాలోని రాజకీయ దురందరులు అందరూ ఒకప్పటి సర్పంచులే. రాజకీయ తెరంగేట్రానికి తొలిమెట్టును ఆధారంగా చేసుకొని అంచెలంచెలుగా ఎదిగిని వారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చాలా మంది ఉన్నారు. సర్పంచ్గా రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఎమ్మెల్యేలుగా, జెడ్పీ చైర్మన్లుగా, మంత్రులుగా, స్పీకర్లుగా ఎదిగారు. ఎన్ని ఉన్నత పదవులు చేపట్టినా తొలి అడుగు మాత్రం పల్లె పెద్దగానే పడింది. తమ రాజకీయ జీవితాలకు సర్పంచ్ పదవిని పునాదులు వేసుకున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతల రాజకీయ ప్రస్థానంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
సర్పంచ్ నుంచి మంత్రులుగా..
జిల్లాకు చెందిన పలువురు నేతలు సర్పంచుల నుంచి మంత్రులయ్యారు. జువ్వాడి రత్నాకర్రావు, న్యాలకొండ రాంకిషన్రావు, కెప్టెన్ లక్ష్మీకాంతారావు, సుద్దాల దేవయ్యలు రాష్ట్ర మంత్రులుగా పనిచేయగా దుద్దిళ్ల శ్రీపాదరావు స్పీకర్గా సుదీర్ఘకాలం సేవలందించారు. ఇలా పల్లె రాజకీయాల్లో తొలి అడుగులు వేసిన నేతలు కాలక్రమంలో ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పని చేసి రాష్ట్ర స్థాయిలో మంచి పేరు సంపాదించారు.
దేవాదాయశాఖ మంత్రిగా..
ధర్మపురి మండలం తిమ్మాపూర్కు చెందిన జువ్వాడి రత్నాకర్రావు రెండుసార్లు సర్పంచ్గా గెలుపొందారు. 1981 నుంచి 1987 వరకు జగిత్యాల సమితి అధ్యక్షుడిగా పనిచేశారు. 1989, 1999, 2004లో ఎమ్మెల్యేగా బుగ్గారం నుంచి గెలుపొంది వైఎస్సార్ మంత్రివర్గంలో దేవాదాయశాఖ మంత్రిగా పనిచేశారు.
కరీంనగర్ ఎమ్మెల్యేగా..
కరీంనగర్ ఎమ్మెల్యేగా 1989లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన వెలిచాల జగపతిరావు అంతకు ముందు రామడుగు మండలం గుండి సర్పంచ్గా పనిచేశారు.
జెడ్పీ చైర్మన్ వరకు..
మానకొండూరు సర్పంచ్గా రెండుసార్లు పనిచేసిన ఆరెపల్లి మోహన్ అనంతరం జెడ్పీటీసీగా గెలిచి జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యారు. 2009లో మానకొండూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రభుత్వ విప్గా పనిచేశారు.
కమ్మరిఖాన్పేట సర్పంచ్గా..
ధర్మారం మండలం కమ్మరిఖాన్పేటకు చెందిన గుజ్జుల రామకృష్ణారెడ్డి 1988 నుంచి 1995 వరకు సర్పంచ్గా పనిచేశారు. ధర్మారం మండల పరిషత్ ఉపాధ్యక్షుడిగా 1995లో ధర్మారం జెడ్పీటీసీగా గెలుపొందారు. 1999లో పెద్దపల్లి ఎమ్మెల్యేగా గెలిచారు.
గంగాధర సర్పంచ్గా..
గంగాధరకు చెందిన న్యాలకొండ రాంకిషన్రావు 1985 వరకు సర్పంచ్గా, సమితి ఉపాధ్యక్షుడిగా కొనసాగారు. చొప్పదండి ఎమ్మెల్యేగా రెండు పర్యాయాలు గెలిచిన ఆయన 1995లోమంత్రి అయ్యారు.
పల్లె నుంచి అసెంబ్లీకి
పల్లె నుంచి అసెంబ్లీకి
పల్లె నుంచి అసెంబ్లీకి
పల్లె నుంచి అసెంబ్లీకి
పల్లె నుంచి అసెంబ్లీకి
పల్లె నుంచి అసెంబ్లీకి
పల్లె నుంచి అసెంబ్లీకి
పల్లె నుంచి అసెంబ్లీకి
పల్లె నుంచి అసెంబ్లీకి
పల్లె నుంచి అసెంబ్లీకి


