అమృత్‌ పథకంతో ఇంటింటా నీరు | - | Sakshi
Sakshi News home page

అమృత్‌ పథకంతో ఇంటింటా నీరు

Jun 10 2025 3:38 AM | Updated on Jun 10 2025 3:38 AM

అమృత్‌ పథకంతో ఇంటింటా నీరు

అమృత్‌ పథకంతో ఇంటింటా నీరు

● కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్‌

చొప్పదండి: ఇంటింటికి నీళ్లు, డ్రైనేజీ సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా అమృత్‌ 1, అమృత్‌ 2.0 పథకాల ద్వారా తెలంగాణలో రూ.6వేల కోట్ల పైచిలుకు నిధులతో, దేశంలో రూ 2.99లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ తెలిపారు. చొప్పదండి పట్టణంలో రూ.36.3కోట్ల వ్యయంతో వాటర్‌ ఇంప్రూవ్‌మెంట్‌ స్కీంకు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి భూమిపూజ, శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమతమ వాటాతో ఖర్చు చేస్తున్నాయన్నారు. అమృత్‌ పథకం కింద దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కోటి34లక్షల నీటి కనెక్షన్లను అందించగలిగామని అన్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో రూ.852కోట్లు కేటాయించగా.. కేంద్రం వాటా రూ.481కోట్లు ఉందన్నారు. ఎమ్మెల్యే సత్యం మాట్లాడుతూ.. అతి త్వరలోనే చొప్పదండి ప్రజల దాహార్తిని తీర్చబోతున్నామన్నారు. ఈఈ సంపత్‌కుమార్‌, నాగరాజు, నవీన్‌కుమార్‌, నాయకులు కొత్తూరి మహేశ్‌, గుర్రం నీరజ, శ్రీనివాస్‌రెడ్డి, పెరుమాండ్ల గంగయ్యగౌడ్‌, కోమటిరెడ్డి పద్మాకర్‌రెడ్డి, చందు, ముద్దం తిరుపతిగౌడ్‌, చేపూరి సత్యనారాయణ, చిల్ల శ్రవణ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement