
అమ్మా.. ఆలకించరూ!
కరీంనగర్ అర్బన్: అవే సమస్యలు.. అవే వినతులు.. తమ సమస్యలకు విముక్తి కల్పించాలని వేడుకున్నారు బాధితులు. మండల, డివిజన్ స్థాయిలో పరిష్కారం కరువైందని, ప్రజావాణితోనైనా బాసట లభిస్తుందనుకుంటే ఇక్కడ అదే పరిస్థితని వాపోయారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణికి జిల్లావ్యాప్తంగా 304 అర్జీలు వచ్చాయని కలెక్టరేట్ ఏవో గడ్డం సుధాకర్ వివరించారు. కాగా వచ్చిన వారే మళ్లీమళ్లీ రావడం కనిపించింది. ప్రధానంగా భూసమస్యలు, పింఛన్లు, సదరం సర్టిఫికెట్లు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన దరఖాస్తులు రాగా.. కలెక్టర్ పమేలా సత్పతి పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యమిచ్చి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు, ఆర్డీవో మహేశ్వర్, డీఎండబ్ల్యూవో పవన్కుమార్ అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురిని సాక్షి పలకరించగా.. వారి ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వివరాలు వారి మాటల్లోనే.
ప్రజావాణికి 304 దరఖాస్తులు
సమస్యలు పరిష్కరించాలని వేడుకోలు
మొత్తం అర్జీలు: 304
మున్సిపల్ కార్పొరేషన్: 63
వారధి సొసైటీ: 16
తహసీల్దార్ మానకొండూర్: 15
తహసీల్దార్ కరీంనగర్ రూరల్: 15
ఆర్డీవో కరీంనగర్: 12
డీపీవో: 09, సీపీ ఆఫీస్: 07