గురుకులంలో ఫోన్‌మిత్ర | - | Sakshi
Sakshi News home page

గురుకులంలో ఫోన్‌మిత్ర

Jun 11 2025 11:31 AM | Updated on Jun 11 2025 11:38 AM

గురుక

గురుకులంలో ఫోన్‌మిత్ర

● విద్యార్థులకు ఫోన్‌ సదుపాయం ● తల్లిదండ్రులతో మాట్లాడుకునే వెసులుబాటు ● ఏఐ సౌకర్యం గల ఫోన్‌ల ఏర్పాటు

గంభీరావుపేట(సిరిసిల్ల): గురుకుల విద్యార్థులకు ఇన్నాళ్లు వారు ఎదుర్కొంటున్న సమస్యలు చెప్పుకునేందుకు ఎలాంటి ఫోన్‌ సౌకర్యం లేదు. కనీసం తల్లిదండ్రులతో మాట్లాడుదామన్నా అవకాశం లేకుండేది. కానీ ప్రభుత్వం ‘ప్రాజెక్టు మిత్ర’ పేరుతో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గురుకులాల్లో ఏఐ సౌకర్యం గల టెలిఫోన్‌ బాక్స్‌లను ఏర్పాటు చేస్తున్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతిని పురస్కరించుకొని ఏప్రిల్‌లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో విద్యనభ్యసించే విద్యార్థులు తమ తల్లిదండ్రులతో మాట్లాడేందుకు వీలు కల్పించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా 7 నుంచి 10 టెలిఫోన్‌ బాక్స్‌లను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో చిన్నబోనాల, నర్మాల, బోయినపల్లి, వేములవాడ, ముస్తాబాద్‌, ఇల్లంతకుంట, బద్దెనపల్లి గ్రామాల్లో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు ఉన్నాయి.

నలుగురికో స్మార్ట్‌ కార్డు

ఫోన్‌మిత్ర కార్యక్రమంలో భాగంగా ప్రతీ నలుగురు విద్యార్థులకు కలిపి ఒక స్మార్ట్‌కార్డును జారీ చేయనున్నారు. స్మార్ట్‌కార్డుతో రోజులో 25 నిమిషాలపాటు వారి తల్లిదండ్రులతో మాట్లాడే వెసులుబాటు కల్పించనున్నారు. స్మార్టుకార్డు కేటాయించే సమయంలో మొదట తల్లిదండ్రులు ఏదైనా సెల్‌ఫోన్‌ నంబర్‌ను పాఠశాల సిబ్బంది వద్ద నమోదు చేయించుకోవాలి. కేవలం ఆ నంబ ర్‌కు మాత్రమే స్మార్ట్‌కార్డు ద్వారా ఫోన్‌చేసే వీలుంటుంది. పాఠశాలలో ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్‌చేసి గురుకుల సొసైటీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయవచ్చు.

లక్ష్యాలు ఇవీ..

● గురుకుల విద్యార్థుల కుటుంబ అనుబంధాల ను బలోపేతం చేసి భావోద్వేగాల ఉద్దీపనా లను సమర్థవంతమైన మద్దతు కల్పించడం.

● మానసిక ఒత్తిడి, ఆత్మహత్యల వంటి విషాదాల నివారణకు మానసిక నేపథ్యాన్ని అందించడం.

విద్యార్థులకు ఉపయుక్తం

విద్యార్థులు కొందరు వివిధ కారణాలతో క్షణికావేశానికి లోనై తమ జీవితాలను అకారణంగా ముగించుకుంటున్నారు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని విద్యార్థుల్లో మానసిక, భావోద్వేగ ఆరోగ్యాన్ని కల్పించడానికి ప్రభుత్వం ఫోన్‌మిత్ర కార్యక్రమాన్ని చేపట్టింది. మా పాఠశాలలో ఫోన్‌లు ఏర్పాటు చేశారు. విద్యార్థులు వచ్చిన తర్వాత వారు ఇచ్చే నంబర్‌లను రిజిస్టర్‌ చేయడం జరుగుతుంది. ఆ నంబర్‌లకు మాత్రమే కాల్‌చేసి మాట్లాడే వీలుంటుంది. ఈ కార్యక్రమం విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.

– సృజన, ప్రిన్సిపాల్‌, నర్మాల సాంఘిక

సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల

గురుకులంలో ఫోన్‌మిత్ర1
1/1

గురుకులంలో ఫోన్‌మిత్ర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement