
కుక్కల దాడిలో గొర్రెలు మృతి
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం మల్యాల గ్రామంలో బుధవారం పిచ్చికుక్కల దాడిలో బొట్కు మహేశ యాదవ్కు చెందిన 20 గొర్రెలు మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈసంఘటనలో సుమారు రూ.లక్ష వరకు నష్టం వాటినట్లు బాధితుడు మహేశ్ బావురుమన్నాడు. గ్రామంలో పిచ్చికుక్కలు స్వైర విహారం చేస్తున్నాయని గ్రామస్తులు పేర్కొన్నారు. అధికారులు తగిన చర్యలు తీసుకొని కుక్కల బెడద తప్పించాలని వారు విజ్ఞప్తి చేశారు.
మడేలేశ్వరస్వామి ఆలయంలో చోరీ
● 15 గ్రాముల బంగారం చోరీ
జగిత్యాలక్రైం: జగిత్యాలలోని మంచినీళ్ల బావి వద్దగల మడేలేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం రాత్రి గుర్తుతెలియని దొంగలు చోరీకి పాల్పడ్డారు. పూజ అనంతరం అర్చకులు ఆలయానికి తాళం వేసి వెళ్లారు. గుర్తుతెలియని దొంగలు చొరబడి 15 గ్రాముల బంగారం, హుండీలో కొంత నగదు ఎత్తుకెళ్లారు. ఉదయం అర్చకులు వెళ్లి చూసేసరికి తాళాలు పగులగొట్టి ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు. పట్టణ ఎస్సై మన్మథరావు సంఘటన స్థలానికి చేరుకుని దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
తంగళ్లపల్లి: ద్విచక్రవాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందాడు. గ్రామస్తులు, పోలీసుల వివరాల ప్రకారం.. జిల్లెల్లకు చెందిన కోడూరి దశరథం గౌడ్ (55) మంగళవారం రాత్రి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా రామచంద్రాపూర్కు చెందిన గంధం పర్శరాములు బైక్పై వెనుకనుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం సిరిసిల్ల ఆస్పత్రికి తరలించారు. దశరథంను కరీంనగర్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతిచెందాడు. మృతుడికి భార్య వెంకటవ్వ, కొడుకులు అరవింద్, అరుణ్ ఉన్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామ్మోహన్ తెలిపారు.

కుక్కల దాడిలో గొర్రెలు మృతి