
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం
మల్యాల: మండలంలోని ముత్యంపేట శివారులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కనిపించినట్లు పోలీసులు తెలిపారు. సుమారు 55 ఏళ్ల వయసుగల వ్యక్తి చనిపోయి ఉన్నాడన్న స్థానికుల సమాచారంతో ఎస్సై నరేశ్కుమార్, బ్లూకోల్ట్స్ కానిస్టేబుల్ మధుసూదన్రెడ్డి, వినయ్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీలో భద్రపరిచామని తెలిపారు. ముత్యంపేట కారోబార్ రాజేశ్వర్రావు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్ తెలిపారు.
భూ వివాదంలో రైతు ఆత్మహత్యాయత్నం
కరీంనగర్రూరల్: భూ వివాదంలో ఓ రైతు సెల్ఫీ వీడియో తీసుకుని క్రిమిసంహారక మందుతాగి ఆత్మహత్యాయత్నాకి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితుడి కథనం మేరకు.. ఆరెపల్లికి చెందిన రైతు వీణవంక రమేశ్కు కరీంనగర్ మండలం నగునూరులో వారసత్వంగా వచ్చిన 2.20 ఎకరాల వ్యవసాయభూమి ఉంది. కొందరువ్యక్తులు దౌర్జన్యంగా భూమిని ఆక్రమించుకుని మోఖాపైకి వస్తే చంపుతామంటూ రమేశ్ను బెదిరింపులకు గురిచేస్తున్నారు. ఈనెల 10న నగునూరులోని భూమి వద్దకు వెళ్లిన రమేశ్ సెల్ఫీవీడియో తీసుకుని తాను క్రిమిసంహారక మందుతాగి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు స్టేటస్ పెట్టుకున్నాడు. సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు రమేశ్ను చికిత్స కోసం కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. రైతు ఆత్మహత్యాయత్నానికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
భార్య కిడ్నీ ఇచ్చినా దక్కని ప్రాణం
● అమర్చిన మరుసటి రోజే భర్త మృతి
కోరుట్ల రూరల్: కోరుట్ల మండలం సంగెం గ్రామానికి చెందిన వంగ మల్లేశం (50) కిడ్నీ మార్చిన మరుసటి రోజే మృతి చెందాడు. మల్లేశంకు ఐదేళ్ల క్రితం రెండు కిడ్నీలు పాడయ్యాయి. అప్పటి నుంచి డయాలసిస్ చేయించుకుంటున్నాడు. ఆయన భార్య లక్ష్మి కిడ్నీ ఇవ్వడానికి అంగీకరించగా.. నెల రోజులుగా హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం లక్ష్మి ఓ కిడ్నీ తీసి మల్లేశంకు అమర్చారు. బుధవారం ఆసుపత్రిలోనే మృతి చెందాడు. భర్త ప్రాణాలు కాపాడుకునేందుకు భార్య కిడ్నీ దానం చేసినప్పటికీ మృతి చెందడం కుటుంబంలో విషాదం నింపింది. మల్లేశం దంపతులకు కూతురు, కుమారుడు ఉన్నారు.

గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం

గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం