
మహిళల సంక్షేమమే ధ్యేయం
కరీంనగర్: మహిళల సంక్షేమమే శుక్రవారం సభ ధ్యేయమని కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నా రు. కరీంనగర్లోని దుర్గమ్మగడ్డ అంగన్వాడీకేంద్రంలో మహిళాభివృద్ధి, శిశుసంక్షేమశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సభ నిర్వహించారు. కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాల్లో చదువుతోపాటు ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారని తెలిపారు. మూడునుంచి ఆరేళ్లలోపు పిల్లల ను అంగన్వాడీలకు పంపించాలని సూచించారు. ఆరోగ్య మహిళ కార్యక్రమం ద్వారా మహిళలకు 50రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తున్నామని తెలిపారు. అనంతరం చిన్నారులకు కోడిగుడ్డు బిర్యానీ వడ్డించారు. మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, డీఎంహెచ్వో వెంకటరమణ, సీడీపీవో సబిత పాల్గొన్నారు.
జల్జీవన్పై కేంద్ర బృందం తనిఖీ
కరీంనగర్ అర్బన్: జల్ జీవన్ మిషన్ పథకం అమలు పర్యవేక్షణలో భాగంగా సెంట్రల్ వాటర్ కమిషన్ పరిధిలోని కేంద్ర నోడల్ అధికారుల బృందం జిల్లాలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఇందిరమ్మ ప్రధాన వరద కాలువ, మధ్య మానేరు కాలువలు, ఉపకాల్వలను తనిఖీ చేసింది. సెంట్రల్ వాటర్ కమిషన్ సంయుక్త కార్యదర్శి సింతల్ రాజన్ చొక్కలింగం ఆధ్వర్యంలోని ఈ కేంద్ర అధికారుల బృందం కలెక్టరేట్లో కలెక్టర్ పమేలా సత్పతి, నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశమైంది. నీటిపారుదల పనులకు సంబంధించి గతంలో కేంద్రం మంజూరు చేసిన నిధులతో జిల్లాలో పూర్తిచేసిన పనుల గురించి తెలుసుకున్నారు. 92శాతం ఇందిరమ్మ వరద కాలువ పనులు పూర్తయ్యాయని ఇంజినీర్లు వివరించారు. భూ సేకరణలో ఇబ్బందుల వలన కొంతమేర పనులు పెండింగ్లో ఉన్నాయని, ఇందుకు సుమారు రూ.300కోట్లు అవసరమవుతాయని అధికారులు వెల్లడించారు. కేంద్ర బృందం సభ్యులు మాట్లాడుతూ నీటిపారుదల ప్రాజెక్టు పెండింగ్ పనులను పూర్తి చేయడానికి పూర్తి నివేదిక కేంద్రానికి అందజేస్తామని తెలిపారు. కేంద్ర బందం సభ్యులు సుధీర్ కుమార్, ఈఈ ధీరజ్ సింఘాల్, సూపరింటెండెంట్ ఇంజినీర్ సుమతీదేవి, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జగన్, ఎస్ఈ పెద్ది రమేశ్ పాల్గొన్నారు.
● కలెక్టర్ పమేలా సత్పతి