
రాష్ట్రస్థాయి వాలీబాల్ జట్ల ఎంపిక
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని రాజీవ్నగర్ మినీ స్టేడియంలో మంగళవారం రాష్ట్ర స్థాయి వాలీబాల్ జట్ల ఎంపిక తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు జరిగింది. రాష్ట్ర స్థాయిలో 2025–26 విద్యా సంవత్సరానికి హైదరాబాద్ సరూర్నగర్ వాలీబాల్ అకాడమీలో ఖాళీగా ఉన్న క్రీడాకారుల జట్లను ఎంపిక చేశారు. జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి ఆజ్మీరా రాందాస్, సరూర్నగర్ డీవైఎస్వో వెంకటేశ్వర్రావు, తెలంగాణ వాలీబాల్ అసోసియేషన్ ట్రెజరర్ కృష్ణప్రసాద్, అకాడమీ కోచ్లు రమాదేవి, వీరారెడ్డి పర్యవేక్షణలో ఎంపిక జరిగింది. కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వాలీబాల్ అకాడమీ కోచ్ సంపత్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా సెక్రెటరీ గిన్నె లక్ష్మణ్, రాజన్న సిరిసిల్ల వాలీబాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చెన్నమనేని శ్రీకుమార్, రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన బాలబాలికలు 115 మంది పాల్గొన్నారు. ఎంపికై న క్రీడాకారులు రాష్ట్రం తరుఫున జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటారని, వారికి అవసమైన శిక్షణ ఇస్తామని నిర్వాహకులు ప్రకటించారు.
పాల్గొన్న 115 మంది క్రీడాకారులు

రాష్ట్రస్థాయి వాలీబాల్ జట్ల ఎంపిక