
బోనమో నమః
మానకొండూర్ మండలం అన్నారం గ్రామంలో బోనాల ఊరేగింపు అత్యంత కోలాహలంగా జరిగింది. అన్నారం గొల్ల, కురుమ సంఘం ఆధ్వర్యంలో బీరప్ప, కమరాతి, అక్క మహంకాళి అమ్మవార్ల కల్యాణం, పట్నాల ఉత్సవాలు మొదలయ్యాయి. మహిళలు ప్రతి ఇంటి నుంచి బోనాలతో డప్పుచప్పుళ్ల మధ్య ఊరేగింపుగా బయలుదేరారు. మేకను గావు పట్టడం, బండారి చల్లుకోవడం, కత్తులతో నిర్వహించిన సాహస విన్యాసాలు ఆకట్టుకున్నాయి. గొల్ల, కురుమ సంఘం నాయకులు కత్తర్ల లక్ష్మయ్య, స్వామి, లక్ష్మణ్, అట్ల గట్టయ్య, అట్ల కొండయ్య, సంబు శ్రీనివాస్, దాడి ఐలయ్య, అట్ల కనకయ్య తదితరులు పాల్గొన్నారు. – మానకొండూర్