
ఆధునిక సాగుపై అవగాహన పెంచుకోవాలి
● డీఏవో భాగ్యలక్ష్మి
కరీంనగర్రూరల్: ఆధునిక సాగు పద్ధతులపై రైతులు అవగాహన పెంచుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి భాగ్యలక్ష్మి సూచించారు. సోమవారం వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ శిక్షణా కార్యక్రమంలో భాగంగా నగునూరు, మొగ్ధుంపూర్ గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించారు. డీఏవో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో గత నెల 29 నుంచి ఈనెల 12 వరకు జిల్లాలో వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయంతోపాటు అనుబంధ రంగాల్లో వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలపై అవగాహన కల్పించారు. శాస్త్రవేత్తలు శ్రీధర్, విజయ్, ప్రశాంతి, ఏవో సత్యం, ఏఈవో జాఫరుల్లా, పంచాయతీ కార్యదర్శులు లచ్చయ్య, శ్రావణి, మాజీ ఎంపీటీసీ వినయ్సాగర్, దుర్శేడ్ సింగిల్విండో డైరెక్టర్ కందుల రమేశ్గౌడ్, తొగరు మల్లారెడ్డి, రాఘవేందర్రెడ్డి, మధు తదితరులు పాల్గొన్నారు.
వంద రోజుల ప్రణాళికను విజయవంతం చేయాలి
● జేడీ, ప్రత్యేకాధికారి బోనగిరి శ్రీనివాస్
కరీంనగర్ కార్పొరేషన్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వంద రోజుల ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పురపాలక శాఖ జాయింట్ డైరెక్టర్, వంద రోజుల ప్రణాళిక కార్యక్రమ ప్రత్యేకాధికారి బోనగిరి శ్రీనివాస్ అన్నారు. వంద రోజుల ప్రణాళిక కార్యక్రమాల అమలు తీరును పరిశీలించేందుకు సోమవారం నగరంలో పర్యటించారు. పద్మనగర్లో వంద రోజుల కార్యక్రమాల్లో భాగంగా మొక్కలు నాటిన స్థలాన్ని సందర్శించి మొక్కలు నాటిన పద్ధతిని పరిశీలించారు. సప్తగిరికాలనీలోని పార్క్ను సందర్శించి, గ్రీనరీని పెంచాలని ఆదేశించారు. హౌసింగ్బోర్డుకాలనీ, ఎస్ఆర్ఆర్ సమీపంలోని డీఆర్సీ సెంటర్లను తనిఖీ చేశారు. టవర్సర్కిల్, మార్కెట్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన వీధి వ్యాపారుల మేళాలో పాల్గొన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణలోని మహిళా శక్తి క్యాంటీన్ను పరిశీలించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో రెవెన్యూ, ఇంజినీరింగ్, శానిటేషన్ విభాగ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వంద రోజుల ప్రణాళిక కార్యక్రమాల్లో అన్ని విభాగాల అధికారులు భాగస్వాములు కావాలన్నారు. ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. మహిళా సమాఖ్య సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు వంద రోజుల కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఎస్ఆర్ఆర్ డ్రై వేస్ట్ సెంటర్లో ప్రతిరోజు 10 నుంచి 15 మెట్రిక్ టన్నుల డ్రై వేస్ట్ను సెక్రిగేషన్ చేస్తుండడం అభినందనీయమని అన్నారు. నల్లాలు లేని నివాస గృహాలను గుర్తించి కనెక్షన్ ఇవ్వాలన్నారు. నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ ఖాదర్ మొహియొద్దీన్, డీఈ వెంకటేశ్వర్లు, పర్యావరణ ఇంజినీర్ స్వామి తదితరులు పాల్గొన్నారు.
పవర్ కట్ ప్రాంతాలు
కొత్తపల్లి: విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు పనులతో పాటు మరమ్మతు పనులు చేపడుతున్నందున మంగళవారం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు అంబేడ్కర్ స్టేడియం, కట్టరాంపూర్, భగత్నగర్, గౌతమినగర్, ఎల్ఐసీ కార్యాలయం, కొత్త శ్రీనగర్కాలనీ, తిరుమల థియేటర్, కిశోర్ ఆటోస్టోర్, ఒడిశా స్కూల్, కమాన్ ప్రధాన రహదారి ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేసస్తున్నట్లు టౌన్ 2 ఏడీఈ ఎం.లావణ్య తెలిపారు. అదేవిధంగా ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 11 కేవీ సుభాష్నగర్ ఫీడర్ పరిధిలోని అంబేడ్కర్నగర్, వాటర్ట్యాంక్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్1 ఏడీఈ పి.శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు.

ఆధునిక సాగుపై అవగాహన పెంచుకోవాలి

ఆధునిక సాగుపై అవగాహన పెంచుకోవాలి