● ఇబ్బందులు పడుతున్న భిక్కనూరు బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు
● రెగ్యులర్ హిందీ ఉపాధ్యాయుడిని
నియమించాలని వినతి
భిక్కనూరు : మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో 355 మంది విద్యార్థులు ఉన్నారు. గతే డాది ఆగస్టులో హిందీ ఉపాధ్యాయుడు దేవేంద్రకుమార్ పదవీ విరణ పొందాడు. అప్పటి నుంచి హిందీ ఉపాధ్యాయుడు లేకపోవడంతో విద్యార్థులు ఇ బ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎంఈవో రాజగంగారెడ్డి గతేడాది డిప్యూటేషన్పై ఒక ఉపాధ్యాయు డిని నియమింపజేశాడు. డిప్యూటేషన్ ముగియడంతో హిందీ ఉపాధ్యాయుడు లేకుండా పోయాడు. ఈఏడాది పాఠశాల ప్రారంభం నుంచి టీచర్లు స్వ చ్ఛందంగా విద్యార్థులకు హిందీ పాఠాల ను బోధిస్తున్నారు. ప్రభుత్వం పీటీఎఫ్ ఉన్న పాఠశాలల్లో స్కావెంజర్ల పోస్టులను రద్దుచేసింది. పీటీఎ ్ఫ్ సి బ్బంది ఒక్కరే ఉండడంతో పని భారం అధికంగా ఉంటుంది. విద్యాశాఖాధికారుల స్పందించి రె గ్యులర్ హిందీ ఉపాధ్యాయుడితో పాటు స్కావెంజర్లను నియమించాలని విద్యార్థులు కోరుతున్నారు.


