బాన్సువాడ : ప్రతి ఒక్కరూ శ్రీరామ నామ స్మర ణ చేయాలని సద్గురు స్వామి సమర్థ మహరాజ్ సూచించారు. గురువారం రాత్రి బాన్సువాడలో ని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డి ఇంటి వద్ద స్వామీజీ శ్రీరామ నామ స్మరణ గురు వందనం కార్యక్రమం నిర్వహించా రు. బాన్సువాడ ప్రాంతంపై తనకు అభిమానం ఎక్కువని, భక్తుల కోరిక మేరకు ఇక్కడికి ఐదు సార్లు వచ్చానని పేర్కొన్నారు. మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డి దంపతులు, పోచారం శంభురెడ్డి దంపతులు, పోచారం సురేందర్రెడ్డి, పోచారం భాస్కర్రెడ్డి దంపతులు తదితరులు పాల్గొన్నారు.


