అలరించిన కుస్తీ పోటీలు | - | Sakshi
Sakshi News home page

అలరించిన కుస్తీ పోటీలు

Mar 22 2026 1:34 AM | Updated on Mar 22 2026 1:34 AM

నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి):ఉగాది ఉత్సవాలలో భాగంగా మాసాన్‌పల్లిలో శనివారం కుస్తీపోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల నుంచి మల్లయోధులు తరలివచ్చి కుస్తీపోటీల్లో పాల్గొన్నా రు. కాగా రంగారెడ్డి జిల్లాకు చెందిన జాదవ్‌ చరణ్‌ ఆఖరి కుస్తీపోటీల్లో పాల్గొని రూ.1,500 గెలుచుకున్నారు. ఈ మేరకు విజేతలకు గ్రామసర్పంచ్‌ సునంద, మాజీసర్పంచ్‌ అంజాగౌడ్‌, గ్రామపెద్దలు బహుమతులను అందజేశారు.

కొమలంచలో..

నిజాంసాగర్‌(జుక్కల్‌): నల్లపోచమ్మ ఉత్సవాల్లో భాగంగా శనివారం మహమ్మద్‌నగర్‌ మండలం కొమలంచలో కుస్తీ పోటీలు హోరాహోరీగా సాగాయి. గెలుపొందిన మల్లయోధులకు నిర్వాహకులు నాగభూషణంగౌడ్‌, గంగారెడ్డి నగదును బహుమానంగా అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement