క్రైం కార్నర్
చికిత్స పొందుతూ ఒకరి మృతి
తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన షెట్టి నాగరాజు(48) చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై నరేశ్ తెలిపారు. నాగరాజు కులవృత్తితోపాటు వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ముగ్గురు కూతుళ్లు ఉండగా ఇద్దరికి పెళ్లి చేశారు. మూడో కూతురు హైదరాబాద్లో నివసిస్తోంది. ఇద్దరి కుమార్తెల వివాహాల ఖర్చుల కారణంగా కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. గతంలో నాగరాజు దుబాయి వెళ్లి అప్పుల పాలయ్యాడు. చిన్న కూతురు వివాహం చేయలేక, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోలేక జీవితంపై విరక్తి చెంది నాగరాజు ఈ నెల 2న గడ్డిమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబసభ్యులు అపస్మారక స్థితిలో ఉన్న నాగరాజును కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించగా మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య శ్యామల ఉన్నారు.
ప్రమాదవశాత్తు వృద్ధురాలి..
సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలో ఓ వృద్ధురాలు ప్రమాదవశాత్తు కాలుజారి బావిలో పడి మృతి చెందినట్లు ఎస్సై సిద్దిఖీ తెలిపారు. మండల కేంద్రానికి చెందిన కల్లెం దుర్గవ్వ(67) బట్టలు ఉతకడానికి సమీపంలో బావి వద్దకు వెళ్లింది. బట్టలు ఉతుకుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారడంతో నీట మునిగి మృతి చెందినట్లు పేర్కొన్నారు. మృతురాలి భర్త సాయిలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
సదాశివనగర్(ఎల్లారెడ్డి):మండలంలోని అడ్లూర్ ఎ ల్లారెడ్డి గ్రామానికి చెందిన రజినీకాంత్(40) అనే వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు హర్యానాలో హత్య చేసినట్లు గ్రామస్తులు తెలిపారు.రజినీకాంత్ను అ తి కిరాతకంగా పొడిచి చంపినట్లు పేర్కొన్నారు. హత్యకు గల కారణా లు తెలియరాలేదు.కుటుంబసభ్యులకు సమాచారం రావడంతో పోలీసుల సహాయంతో మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు హర్యానాకు వెళ్లినట్లుగ్రామస్తులు పేర్కొన్నారు.
క్రైం కార్నర్


