
‘భూభారతి’తో సామాన్యుడికి మేలు
నాగిరెడ్డిపేట/లింగంపేట : భూభారతి చట్టం ద్వా రా సామాన్యుడికి మేలు జరగుతుందని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులే టి శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయ న శెట్పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన భూభారతి రెవెన్యూ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ఏది చెబితే అదే చట్టంగా ఉండేదన్నారు. దొర గారు ధరణి పథకాన్ని భూస్వాముల కోసం తెచ్చి వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. భూభా రతి చట్టం అలా కాకుండా పకడ్బందీగా పేదోడికి న్యాయం జరిగేలా రూపొందించామన్నారు. 18 రా ష్ట్రాల్లోని చట్టాలను అధ్యయనం చేసి, 9 నెలలు మే ధోమథనం చేసి మేధావుల సూచనలు, సలహాలు తీసుకొని ఈ చట్టాన్ని తెచ్చామన్నారు. ఇది దేశానికి రోల్ మోడల్ కాబోతుందన్నారు. తరతరాలుగా రై తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు భూభారతి పో ర్టల్ ద్వారా తీరనున్నాయని పేర్కొన్నారు.
అంచెలంచెలుగా సమస్యల పరిష్కారం
భూభారతి చట్టం ద్వారా తహసీల్దార్, ఆర్డీవో, అడిషనల్ కలెక్టర్, కలెక్టర్, సీసీఎల్.. ఇలా వివిధ స్థా యిలలో భూ సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. ఆయా స్థాయిలలో పరిష్కారం కాకపోతే స్పెషల్ ట్రిబ్యునల్ ప్రవేశపెట్టడానికి చట్టంలో వెసులుబాటు కల్పించామన్నారు. రెవెన్యూ అధికారులు ఉద్దేశపూర్వకంగా తప్పులు చేస్తే ఈ చట్టం ద్వారా సదరు అధికారిపై చర్యలు తీసుకోవడానికి వీలుంటుందన్నారు. లింగంపేట మండలంలో ప్రైవేటు, ప్రభుత్వ, అసైన్మెంటు భూముల సమస్యలు ఉ న్నందున కలెక్టర్ విచారణ చేసి పరిష్కరించాలని ఆదేశించారు.
ఎమ్మెల్యే విన్నపం మేరకు..
ముందుగా రాష్ట్రంలో 4 జిల్లాల్లో 4 మండలాలను ఎంపిక చేసి, చట్టాన్ని అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఎమ్మెల్యే మదన్మోహన్రావు విన్నపం మేరకు లింగంపేట మండలాన్ని పైలట్ మండలంగా ఎంపిక చేశామన్నారు. ఇప్పటివరకు మండలంలోని 23 రెవెన్యూ గ్రామాలకుగాను 20 చోట్ల సదస్సులు పూర్తయ్యాయని, వివిధ భూసమస్యలపై 3,400 దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు.
హామీలు అమలు చేసి తీరుతాం..
ఇందిరమ్మ రాజ్యంలో పేదల కోసం ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు ఇతర హామీలన్నింటిని అమ లు చేసి తీరుతామని పొంగులేటి స్పష్టం చేశారు. ఇప్పటికే పలు పథకాలను అమలు చేస్తున్నామన్నా రు. ప్రజల కోరిక మేరకు పక్షం రోజుల్లో వీఆర్వో లు, వీఆర్ఏలను నియమించనున్నట్లు తెలిపారు. సీఎం రేవంత్రెడ్డితో మాట్లాడి ప్రాణహిత ప్యాకేజీ పనులకు నిధులు మంజూరయ్యేలా చూస్తానని జ హీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కార్ పేర్కొన్నారు. ఎల్లారెడ్డి నియోజక వర్గంలో భూ సమస్యలు ఎక్కువగా ఉన్న విషయాన్ని సీఎం, రెవెన్యూ మంత్రి దృష్టికి తీసుకువెళ్లానని, వారు స్పందించి భూభారతి చట్టం అమలుకు లింగంపేట మండలాన్ని పైలట్ మండలంగా ఎంపిక చేశారని ఎమ్మెల్యే మదన్మోహన్రావు పేర్కొన్నారు. రైతులకు భూ సమస్యలు లేకుండా చేయాలన్నదే తన లక్ష్యమన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేశ్ చంద్ర, అదనపు కలెక్టర్ విక్టర్, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, భూభారతి ప్రత్యేకాధికారి రాజేందర్, ఆర్డీవో మన్నె ప్రభాకర్, తహసీల్దార్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రి దృష్టికి ‘పోచారం’ భూముల సమస్య
నాగిరెడ్డిపేట: పోచారం గ్రామశివారులోని భూముల సమస్యను గ్రామానికి చెందిన మాల్తుమ్మెద సొసైటీ డైరెక్టర్ శ్రీనివాస్రెడ్డి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. శెట్పల్లి సదస్సు భూసమస్యపై రైతులెవరైనా మాట్లాడాలని మంత్రి సూచించగా.. పోచారం గ్రామానికి చెందిన శ్రీనివాస్రెడ్డి మాట్లాడారు. తమ గ్రామశివారులోని రైతుల భూములకు పట్టాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. పోచారం ప్రాజెక్టు అంచునగల సర్వే నం. 268లో రైతులకు 1975 లోనే అప్పటి ప్రభుత్వం విడతలవారీగా సుమారు 150 ఎకరాలకు పట్టాపాసుపుస్తకాలు ఇచ్చిందన్నారు. కానీ ధరణి వల్ల కొత్త పాస్బుక్కులు రాలేదన్నారు. ఈ విషయాన్ని రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్తే సర్వే నం. 268లో 54 ఎకరాల భూమి మాత్రమే ఉందని, కానీ 150 ఎకరాలకు పట్టాలు ఇచ్చారని చెప్పారని పేర్కొన్నారు. తమ గ్రామ రైతులకు పట్టాలు ఇప్పించాలని కోరారు. దీనిపై మంత్రి స్పందిస్తూ రెవెన్యూ అధికారులను వివరణ కోరారు. మరోసారి భూములను సర్వే చేయించి సమస్యను పరిష్కరిస్తామని ఎల్లారెడ్డి ఆర్డీవో మన్నె ప్రభాకర్ పేర్కొన్నారు.
18 రాష్ట్రాల్లో అధ్యయనం చేసి
ఈ చట్టాన్ని తెచ్చాం
ఇది దేశానికి రోల్ మోడల్ కాబోతోంది
త్వరలో వీఆర్వోలు, వీఆర్ఏలను
నియమిస్తాం
రెవెన్యూ శాఖ మంత్రి
పొంగులేటి శ్రీనివాస్రెడ్డి

‘భూభారతి’తో సామాన్యుడికి మేలు

‘భూభారతి’తో సామాన్యుడికి మేలు