
ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని ఆయా గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం వేగవంతం చేయాలని సిబ్బందికి సూచించారు. మంగళవారం స్థానిక ఐకేపీ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు తాగునీరు ఏర్పాటు చేసి, నీడకోసం పచ్చని పందిర్లు వేయాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు వేగం పెంచి ట్యాబ్లో నమోదు చేయాలన్నారు.అలాగే మహిళా సంఘాల సభ్యులు పాఠశాలల యునిఫామ్స్ కుట్టే ప్రతీ విద్యార్థి కొలతలు తీసుకొని ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. స్కూల్ యునిఫాం కుట్టే మహిళలకు మంచి ఆదాయం వచ్చేలా చూడాలన్నారు. కార్యక్రమంలో ఏపీఎం శ్రీనివాస్, సీసీలు రాజిరెడ్డి, గంగరాజు, నజీర్, మేహర్, మన్సూర్, స్వప్న, శ్రావణ్, బాలయ్య, సీ్త్రనిధి మేనేజర్ అమల, నరేందర్, రవి పాల్గొన్నారు.