తాగునీటి మానిటరింగ్‌ సెల్‌ ఏర్పాటు | - | Sakshi
Sakshi News home page

తాగునీటి మానిటరింగ్‌ సెల్‌ ఏర్పాటు

Published Tue, Mar 25 2025 1:37 AM | Last Updated on Tue, Mar 25 2025 1:33 AM

కామారెడ్డి క్రైం: జిల్లాలో ఎక్కడైనా తాగునీటి సమస్య తలెత్తితే వెంటనే కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన తాగునీటి మానిటరింగ్‌ సెల్‌కు సమాచారం ఇవ్వాలని కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ సూచించారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన మానిటరింగ్‌ సెల్‌ను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ తాగు నీటి సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్‌లో ప్రత్యేక సెల్‌ ను ఏర్పాటు చేశామన్నారు. ఎక్కడైనా సమస్య తలెత్తితే 99087 12421 నంబర్‌కు ఫోన్‌ చేయాలని సూచించారు. ఈ మానిటరింగ్‌ సెల్‌ రోజూ ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తుందని తెలిపారు. వచ్చిన ఫిర్యాదులను నమోదు చేసుకుని సంబంధిత శాఖల అధికారుల ద్వారా సమస్యను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి, డీపీవో మురళి, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement