మేం ప్రజాసామ్యబద్ధంగా ఎన్నికల్లో పోటీ చేసి నెగ్గాం. రాజ్యాంగం ప్రకారం మాకు ఐదు సంవత్సరాలు పరిపాలించే అధికారం ఉంది. కానీ, ఈ ప్రభుత్వం ఈ నెల 25 నుంచే నా చెక్పవర్ నిలిపివేసింది. చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచీ సర్పంచ్లను ఇబ్బందులు పెడుతోంది. గతంలో 18వ ఆర్థిక సంఘం నిధులు ఖర్చు చేయకుండా ఇబ్బందులు పెట్టింది. ప్రస్తుతం ఇంకా పదవీ కాలం ఉండగానే మా చెక్పవర్ రద్దు చేసింది.
– సాదే ఆశాజ్యోతి, సర్పంచ్,
కరప గ్రామ పంచాయతీ


