వేగంగా.. తగ్గుముఖం | - | Sakshi
Sakshi News home page

వేగంగా.. తగ్గుముఖం

Mar 23 2026 8:44 AM | Updated on Mar 23 2026 8:44 AM

నీటి ఎత్తిపోతలకు ఇక్కట్లు..

ప్రస్తుతం శ్రీశైలం డ్యాంలో 60 టీఎంసీల నీటినిల్వ ఉంది. విద్యుత్‌ ఉత్పత్తి నిరంతరాయంగా కొనసాగితే కేఎల్‌ఐ ద్వారా తాగు, సాగునీటి ఎత్తిపోతలకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ సీజన్‌లో కేఎల్‌ఐలోని మూడు మోటార్ల ద్వారా 33 టీఎంసీల నీటిని ఎత్తిపోశారు. రోజు రెండు మోటార్లను నడిపిస్తున్నారు. 805 అడుగుల వరకు నీటిని ఎత్తిపోసుకోవచ్చు. ఆ తర్వాత నీటిని ఎత్తిపోస్తే మోటార్లపై తీవ్ర ప్రభావం పడుతుంది. అందుకే 810 అడుగుల వరకు మాత్రమే కేఎల్‌ఐ ద్వారా ఎత్తిపోతలు సాగుతున్నాయి. మోటార్లపై భారం పడకుండా నీటి ఎత్తిపోతలు కొనసాగించాలని అధికారులు భావిస్తున్నారు. మిషన్‌ భగీరథ పథకానికి తాగునీటిని అందించడంతో పాటు సాగు అవసరాలకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు నీటిపారుదలశాఖ అధికారులు చెబుతున్నారు.

కొల్లాపూర్‌: కృష్ణానదిలో నీటిమట్టం క్రమంగా తగ్గుతోంది. శ్రీశైలంలో రెండు తెలుగు రాష్ట్రాలు నిరంతరాయంగా విద్యుదుత్పత్తి చేపడుతుండటంతో కొ న్ని రోజులుగా బ్యాక్‌ వాటర్‌ లెవల్స్‌ భారీగా పడిపోతున్నాయి. దీనికితోడు కేఎల్‌ఐ ప్రాజెక్టులో నీటి ఎత్తిపోతలు విరామం లేకుండా సాగుతున్నాయి. ఇ దే తరహాలో నీటిమట్టం తగ్గితే.. వచ్చే నెలలో ఎత్తిపోతలకు బ్రేక్‌ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

837 అడుగుల దిగువకు..

గతేడాది మార్చి నెలాఖరు వరకు శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ 850 అడుగులకు పైగానే ఉంది. ఏప్రిల్‌లో బ్యాక్‌ వాటర్‌ తగ్గడం ప్రారంభమైంది. కానీ ఈ ఏడాది నెల రోజుల ముందునుంచే బ్యాక్‌ వాటర్‌ లెవెల్స్‌ తగ్గుతూ వస్తున్నాయి. శ్రీశైలం జలవిద్యుత్‌ కేంద్రాల్లో ఉత్పత్తి ప్రారంభించడంతో రోజుకు 1 నుంచి 1.5 టీఎంసీల నీటిని వినియోగిస్తున్నారు. ఫలితంగా బ్యాక్‌ వాటర్‌ లెవెల్స్‌ వేగంగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ లెవెల్స్‌ 837 అడుగులకు చేరుకుంది. నెలాఖరు వరకు ఇంకా తగ్గనుంది.

మోటార్లకు మరమ్మతు..

కేఎల్‌ఐ ప్రాజెక్టు ద్వారా ఏప్రిల్‌లోనే ఎత్తిపోతలు ఆగితే ఎల్లూరు పంపుహౌజ్‌లోని మోటార్లకు మరమ్మతులు చేపట్టాలనే యోచనలో అధికారులు ఉన్నారు. కొన్నేళ్ల క్రితమే పంపుహౌజ్‌లోని రెండు మోటార్లు పాడయ్యాయి. మిషన్‌ భగీరథ కోసం విరామం లేకుండా నీటి ఎత్తిపోతలు కొనసాగిస్తుండటంతో.. వాటికి మరమ్మతు చేయడం వీలు కా వడం లేదు. అయితే ఈ ఏడాది నార్లాపూ ర్‌ రిజర్వాయర్‌లో ఉన్న నీటిని మిషన్‌ భగీరథకు మళ్లించి.. కేఎల్‌ఐ మోటార్లకు మరమ్మ తు చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు.

తేలిన పురాతన కట్టడాలు..

శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ తగ్గిపోవడంతో పురాతనమైన సంగమేశ్వరాలయం బయటపడింది. ఈ నెలాఖరు నుంచే ఆలయంలో పూజలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అదే విధంగా సోమశిల సమీపంలోని మసీదు, జటప్రోల్‌ సమీపంలో శిథిలమైన సురభి రాజుల కోట, పురాతన దర్గాలు కూడా తేలాయి. వీటిని తిలకించేందుకు పర్యాటకులు ప్రతి సంవత్సరం పెద్దసంఖ్యలో వస్తుంటారు.

సోమశిల సమీపంలో కృష్ణానదిలో బ్యాక్‌ వాటర్‌

మరో ఐదు

టీఎంసీలు

మాత్రమే..

శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ లెవెల్స్‌ వేగంగా తగ్గుతున్నాయి. కేఎల్‌ఐ ద్వారా ఇప్పటివరకు 33 టీఎంసీల నీటిని ఎత్తిపోశాం. మరో ఐదు టీఎంసీలు ఎత్తిపోసే వీలుంది. రోజూ ఎత్తిపోతలు చేపడుతుండటం వల్ల మోటార్లపై ప్రభావం పడుతోంది. రోజువారీగా చిన్నచిన్న మరమ్మతులు చేపడుతూ.. ఎత్తిపోతలు కొనసాగిస్తున్నాం. ఈ ఏడాది త్వరగా ఎత్తిపోతలు నిలిచిపోతే.. వెంటనే పాడైన మోటార్లకు మరమ్మతు చేయాలని భావిస్తున్నాం.

– లోకిలాల్‌ నాయక్‌,

డీఈ, నీటిపారుదలశాఖ

కృష్ణానదిలో భారీగా పడిపోతున్న బ్యాక్‌ వాటర్‌ లెవల్స్‌

శ్రీశైలం డ్యాంలో

837 అడుగుల ఎత్తులో నీటిమట్టం

గతేడాది కంటే నెలరోజులు ముందుగానే తగ్గుముఖం

వచ్చేనెలలో కేఎల్‌ఐ ద్వారా ఎత్తిపోతలకు బ్రేక్‌ పడే అవకాశం

ఇప్పటి వరకు 33 టీఎంసీలు పంపింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement