రేపు కాళేశ్వరానికి మంత్రి శ్రీధర్‌బాబు రాక | - | Sakshi
Sakshi News home page

రేపు కాళేశ్వరానికి మంత్రి శ్రీధర్‌బాబు రాక

Mar 10 2026 12:47 PM | Updated on Mar 10 2026 12:47 PM

రేపు కాళేశ్వరానికి మంత్రి శ్రీధర్‌బాబు రాక

కాళేశ్వరం: మహదేవపూర్‌ మండలం కాళేశ్వరంలో మే 21నుంచి జూన్‌ 1వ తేదీ వరకు జరుగు సరస్వతీనది అంత్యపుష్కరాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు రేపు (బుధవారం) రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు రానున్నారు. రూ.1.20కోట్ల వ్యయంతో నిర్మించనున్న మ్యూజియం పనులకు శంకుస్థాపన చేస్తారు. ఈ నేపథ్యంలో ఎండోమెంట్‌, పంచాయతీరాజ్‌, ఇరిగేషన్‌ శాఖల ద్వారా జరిగే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని తెలిసింది. ఈ మేరకు దేవాదాయశాఖ ఏర్పాట్లు చేస్తుంది.

రూ.21కోట్ల నిధులు మంజూరు

రాష్ట్ర ప్రభుత్వం గతేడాది రూ.35కోట్లతో సరస్వతినది పుష్కరాలను అంగరంగ వైభవంగా నిర్వహించిన విషయం తెలిసిందే. సరస్వతీనది అంత్యపుష్కరాలను అదే మాదిరిగా మే నెలలో నిర్వహించడానికి రూ.31.60 కోట్లతో పలు పనులకు ప్రతిపాదనలు పంపారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం రూ.21కోట్ల నిధులు మంజూరు చేసి పనులకు పరిపాలన అనుమతులు ఇచ్చినట్లు తెలిసింది. ఈ నిధులతో పుష్కరాల పనులు ప్రారంభం కానున్నాయి.

రూ.1.20కోట్లతో మ్యూజియం పనులకు

శంకుస్థాపన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement