మార్కెట్ విలువ ప్రకారం మా భూములకు సరైన పరిహారం అందించాలి. మా జీవనోపాధి అయిన భూములు తీసుకోవడంతో నష్టం జరుగుతుంది. మాకు జీవనోపాధి కల్పించి, పరిహారం అందేలా చూడాలి. అధికారులు రైతులకు న్యాయం చేయాలి.
– ముత్యాల రమేశ్, రైతు, కాళేశ్వరం
భూ నిర్వాసిత రైతులు ఎవరు కూడా అధైర్య పడొద్దు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ప్రభుత్వం రైతులకు పరిహారం ఇవ్వనుంది. త్వరలో గ్రామసభల ద్వారా నివేదికలు తయారు చేస్తాం. లీజు విషయమై ఉన్నతాధికారులకు తెలియజేస్తాం. త్వరలో వచ్చేలా చూస్తాం.
– రామారావు, తహసీల్దార్, మహదేవపూర్


