
టెట్ గుబులు
న్యూస్రీల్
టెట్ ఉత్తీర్ణత కాని వారు
800 మంది..
గురువారం శ్రీ 9 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేయాలి
రెండేళ్లలో ఉత్తీర్ణులు కావాలన్న సుప్రీంకోర్టు
భూపాలపల్లి అర్బన్: ప్రభుత్వ ఉపాధ్యాయులు తప్పనిసరిగా టెట్ (టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్) ఉత్తీర్ణత కావాల్సిందేనని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు వెలువరించడంతో టీచర్లు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే దీనిపై రిట్ పిటిషన్ వేయాలని గత కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. అలాగే 2010కి ముందు నియమితులైన ఉపాధ్యాయులందరూ రెండేళ్లలో టెట్ అర్హత సాధించాలని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం 2012, 2017, 2024లో చేపట్టిన డీఎస్సీ నియామకాల్లో టెట్ను అమలు చేసింది.
విద్యాహక్కు చట్టంలో సవరణ చేయాలి..
టెట్ మార్గదర్శకాలు తమకు వర్తించవని, సుప్రీం కోర్టు తీర్పు రూల్స్ విరుద్ధమని విద్యా హక్కు చట్టం రాకముందు వివిధ నోటిఫికేషన్ల ద్వారా నియమితులైన ఉపాధ్యాయులు అంటున్నారు. ఇది ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే రిట్ పిటిషన్ వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం కొందరు నిరుద్యోగులే ఒకటి కంటే ఎక్కువసార్లు రాస్తేనే ఉత్తీర్ణత సాధిస్తున్నారని, అలాంటిది 10 నుంచి 15 సంవత్సరాల నుంచి ఉపాధ్యాయ వృత్తి కొనసాగుతున్న వారు టెట్ ఎలా పాస్ అవుతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యాహక్కు చట్టానికి ముందే ఉపాధ్యాయ వృత్తిలో చేరిన వారికి టెట్ మినహాయింపు ఇవ్వాలని, పదోన్నతులు పొందే వారికి టెట్ అమలు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు నాయకులు కోరుతున్నారు. విద్యా హక్కు చట్టంలో సవరణ చేయాలంటున్నారు. అయితే చట్ట సవరణ అధికారం కేవలం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉండగా, అనేక రాష్ట్రాలు సుప్రీంలో రిట్ పిటిషన్ దాఖలు చేశాయి.
2010కి ముందు ఉద్యోగంలో చేరిన ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని సవరించాలి. సుప్రీంకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రిట్ పిటిషన్ వేయాలి. స్టే ఆర్డర్ తీసుకువస్తే బాగుంటుంది.
– మందల రవీందర్రెడ్డి, గెజిటెడ్
ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షుడు
జిల్లాలో 430 పాఠశాలలు, 1,940 మంది టీ చర్లు ఉన్నారు. ఇందులో టెట్ ఉత్తీర్ణత లేని వా రు 800 మందికిపైగా ఉన్నారు. విద్యా హక్కు చట్టం సెక్షన్ 23(1) ప్రకారం 1 నుంచి 8 తరగతులకు బోధించే ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరి చేస్తూ ఎన్సీటీఈ (నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్) 2010 ఆగస్టు 23న నోటిఫికేషన్ విడుదల చేసింది. అనంతరం 2014 నవంబర్ 12న పైస్థాయి పదోన్నతుల కోసం టెట్ తప్పనిసరి చేస్తూ ఎన్సీటీఈ మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. చాలా రాష్ట్రాల్లో టెట్ ఉత్తీర్ణత కాకుండా పదోన్నతులు ఇస్తుండడంతో కొందరు ఉపాధ్యాయులు కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో టెట్ తప్పనిసరి అంటూ కోర్టు పేర్కొంది. రానున్న రెండేళ్లలో టెట్ పాస్ కాకుంటే వెంటనే సర్వీస్ నుంచి తొలగించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. దీంతో ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
కలెక్టర్ రాహుల్ శర్మ
లేదంటే సర్వీస్ నుంచి తొలగింపు
ఆందోళన చెందుతున్న ఉపాధ్యాయులు
జిల్లాలో 1,940 మంది టీచర్లు

టెట్ గుబులు

టెట్ గుబులు