రైతులను రోడ్డు మీదేసిన కాంగ్రెస్‌ | - | Sakshi
Sakshi News home page

రైతులను రోడ్డు మీదేసిన కాంగ్రెస్‌

Sep 1 2025 3:11 AM | Updated on Sep 1 2025 3:11 AM

రైతులను రోడ్డు మీదేసిన కాంగ్రెస్‌

రైతులను రోడ్డు మీదేసిన కాంగ్రెస్‌

రేగొండ: కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనలో రైతాంగం గోస పడుతుందని, రాష్ట్రాన్ని బాగు చేస్తారని నమ్మి ఓట్లేస్తే .. రైతులను నడి రోడ్డున నిలబెడుతున్నారంటూ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి విమర్శించారు. రైతులకు సరిపడా యూరియా అందించాలని ఆదివారం మండల కేంద్రంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. రైతాంగం సాగు అవసరాలపై ముందు చూపు లేకపోవడమే రైతుల కష్టానికి కారణమన్నారు. యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయన్నారు. రాజకీయ ప్రయోజనాలే ధ్యేయంగా ముఖ్యమంత్రి పనిచేస్తున్నాడని ఆరోపించారు. ఇప్పటికై నా ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు అంకం రాజేందర్‌, నాయకులు మహేందర్‌, సుమన్‌, శ్రీనివాస్‌, నరేష్‌, తదితరులు పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement