‘సర్‌’ను విజయవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

‘సర్‌’ను విజయవంతం చేయాలి

Jul 24 2026 1:03 AM | Updated on Jul 24 2026 1:03 AM

పాలకుర్తి టౌన్‌: ‘సర్‌’ ప్రక్రియను క్షేత్రస్థాయిలో విజయవంతం చేయాలని ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి పిలుపునిచ్చారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్‌) కార్యక్రమంపై గురువారం మండల కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి ఆధ్వర్యంలో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతీ బూత్‌ స్ధాయిలో సర్‌ ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని బీఎల్‌ఏలు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. నిర్దేశిత లక్ష్యాన్ని సకాలం పూర్తి చేయాలని ఆమె చెప్పారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ శంకర్‌నాయక్‌, డీసీసీ అధ్యక్షురాలు లకావత్‌ ధన్వంతి, యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు డైరెక్టర్‌ లకావత్‌ లక్ష్మీనారాయణనాయక్‌, నియోజవర్గ కోఆర్డినేటర్‌ ప్రమోదర్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement