అవీ, ఇవీ, అన్నీ.. | - | Sakshi
Sakshi News home page

అవీ, ఇవీ, అన్నీ..

Mar 21 2026 6:03 AM | Updated on Mar 21 2026 6:03 AM

– IIలోu

● వ్యవసాయ రంగానికి రూ.23,179 కోట్లు కేటాయించడం ద్వారా ఉమ్మడి జిల్లాలో 15,01,109 ఎకరాల్లో పంటలు సాగుచేస్తున్న 6,33,229 మంది రైతులకు అర్హతను బట్టి రైతుభరోసా, రైతుబీమా సౌకర్యం కలగనుంది. రైతుభరోసా ద్వారా సుమారు 6.50 లక్షల మంది రైతులకు రూ.900 కోట్ల నుంచి రూ.1,100 కోట్ల వరకు సంవత్సరానికి లబ్ధి చేకూరనుంది.

● ప్రభుత్వం విద్యారంగాన్ని ప్రోత్సహించడానికి ఈబడ్జెట్‌లో రూ.26,674 కోట్లు కేటాయించింది. మొత్తం 3,331 ప్రభుత్వ పాఠశాలల్లో 4,67,011 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. మరుగుదొడ్లు, మూత్రశాలలు, ప్రహరీతోపాటు మౌలిక సదుపాయాల కల్పన కోసం ఈసారి నిధులు వెచ్చించడం ద్వారా విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.

● ఉచిత ప్రయాణ పథకం కొనసాగింపు వల్ల ఆర్టీసీ బస్సుల్లో వరంగల్‌ రీజియన్‌లో రోజుకు సగటున సుమారు 55 వేల మంది మహిళలు రాకపోకలు సాగించనున్నారు.

● ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన సుమారు 8 వేల మంది లబ్ధిదారులకు బిల్లులు అందనున్నాయి.

● గృహజ్యోతి ద్వారా 200 యూనిట్ల లోపు కరెంట్‌ వాడుతున్న 6,12,901 మందికి ఉచిత విద్యుత్‌ సౌకర్యం నిరంతరం కొనసాగనుంది.

బడ్జెట్‌పై భిన్నాభిప్రాయాలు

వివిధ వర్గాల మనోగతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement