పది విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి
● అదనపు కలెక్టర్ పింకేష్కుమార్
రఘునాథపల్లి : పదో తరగతి విద్యార్థుల విద్యా ప్రగతిపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అదనపు కలెక్టర్ పింకేశ్కుమార్ సూచించారు. సోమవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదో తరగతి విద్యార్థుల సామర్ధ్యాలు, ఉపాధ్యాయుల బోధనా తీరును పరిశీలించారు. ఇన్చార్జ్ హెచ్ఎం బాల్నె నాగభూషణం, ఎంఈఓ రఘునందన్రెడ్డి, ఏఎంఓ శ్రీనివాస్, కనకయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


