రేపటి నుంచి గిరిజన తండాల్లో సదస్సులు | - | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి గిరిజన తండాల్లో సదస్సులు

Jun 15 2025 8:13 AM | Updated on Jun 15 2025 8:13 AM

రేపటి నుంచి గిరిజన తండాల్లో సదస్సులు

రేపటి నుంచి గిరిజన తండాల్లో సదస్సులు

జనగామ: జిల్లాలోని గిరిజన తండాల్లో ఈ నెల 16 నుంచి పీఎం దర్తీ ఆభ జన్‌ భాగీ ధారి అభియాన్‌ పథకంపై సదస్సులు నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా తెలిపారు. శనివారం కలెక్టర్‌ మాట్లాడుతూ భారత ప్రభుత్వ ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. జిల్లాలో ఆరు మండలాల పరిధిలో తొమ్మిది గిరిజన తండాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. 16 నుంచి జూలై 2వ తేదీ వరకు సమస్యల పరిష్కారానికి తండాల పరిధిలో సదస్సులను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆధార్‌, కిసాన్‌ క్రెడిట్‌, రేషన్‌కార్డు, కుల ధ్రువీకరణ సర్టిఫికెట్‌, ఆయుష్మాన్‌ భవ, ఇన్సూరెన్స్‌ కవరేజ్‌, వృద్ధాప్య, వితంతు పెన్షన్‌ తదితర పథకాలకు సంబంధించి అర్హులైన వారికి అందించేందుకు సంబంధిత శాఖల సమన్వయంతో వినతులను స్వీకరించనున్నారు. తరిగొప్పుల మండలం భోజ్యా తండా గ్రామపంచాయతీ పరిధి నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు.

తేదీల వారీగా సదస్సుల వివరాలు

ఈ నెల 16, 17న తరిగొప్పుల మండలం భోజ్యాతండా, 18, 19, 20 తేదీల్లో నర్మెట మండలం బొమ్మకూరు, మల్కపేట, 21, 23న చిల్పూరు మండలం ఫతేపూర్‌, 24, 25, 26న పాలకుర్తి మండలం కొండాపూర్‌, మైలారం, 27, 28, 30, జూలై 2న దేవరుప్పుల మండలం లకావత్‌తండా (తూర్పు), ధర్మాపురం, జూలై 2న కొడకండ్ల మండలం నీలిబండతండాలో సదస్సులు నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు.

ఆరు మండలాల్లో తొమ్మిది తండాలు ఎంపిక

కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement