టేబుల్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌కు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

టేబుల్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌కు ఎంపిక

Mar 16 2025 1:20 AM | Updated on Mar 16 2025 1:19 AM

చిల్పూరు: పల్ల గుట్ట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు సురేష్‌ జాతీయ స్థాయి సివిల్‌ సర్వీసెస్‌ టేబుల్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌కు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా స్కూల్‌ ఆవరణలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సురేష్‌ను హెచ్‌ఎం కేతిడి నరసింహారెడ్డి అభినందించిన అనంతరం మాట్లాడారు. ఈ ఏడాది జనవరి 23, 24 తేదీల్లో హైదరాబాద్‌ ఎల్‌బీ స్టేడియంలో నిర్వహించిన స్టేట్‌ లెవల్‌ పోటీల్లో ప్రతిభ కనబర్చిన సురేష్‌.. ఢిల్లీలో ఈనెల 16 నుంచి జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు పేర్కొన్నారు. చిల్పూరు ఆలయ చైర్మన్‌ శ్రీధర్‌రావు, చిర్ర సుమన్‌గౌడ్‌, చిర్ర నాగరాజు, శ్యాంసుందర్‌, రత్నాకర్‌రెడ్డి, జీడి ఆనందం పాల్గొన్నారు.

స్కాలర్‌షిప్‌ విడుదల చేయాలి

జనగామ రూరల్‌: తమ చదువులకు స్కాలర్‌ షిప్‌ విడుదల చేయాలి.. ప్రభుత్వం దగ్గర నిధులు లేవనడం సరికాదు.. తామే ప్రభుత్వానికి నిధులు పంపిస్తాం.. అంటూ వందేమాతరం స్టూడెంట్‌ ఫెడరేషన్‌(వీఎస్‌ఎఫ్‌) ఆధ్వర్యాన శనివారం జనగామలో విద్యార్థులు పలు దుకాణాల వద్దకు వెళ్లి భిక్షాటన చేసి నిరసన తెలిపారు. స్కాలర్‌షిప్‌ విడుదల చేయక తమ చదువులు మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సర్కారు పెండింగ్‌ స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలని, లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా భిక్షాటన చేసి నిధులు సేకరిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నల్ల రాహుల్‌, పట్టణ అధ్యక్షు డు మహ్మద్‌ ఇమ్రాన్‌ పాల్గొన్నారు.

హామీలు నెరవేర్చాకే జిల్లాలో అడుగుపెట్టాలి..

జనగామ రూరల్‌: సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చిన తర్వాతే జిల్లాలో అడుగు పెట్టాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్‌ డిమాండ్‌ చేశారు. శనివారం పట్టణంలో ని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్యనాయకుల సమావేశంలో ఆయన మా ట్లాడారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గ పరిధి శివునిపల్లిలో 117 ఎకరాల్లో రూ. 275 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో లెదర్‌ పార్క్‌ నిర్మాణం చేపట్టాలని 1999లో ప్రతిపాదనలు చేశారని, రెండు విడతల్లో 120 మందికిపైగా లెదర్‌ ఉత్పత్తుల తయారీపై చైన్నెలో శిక్షణ తీసుకున్నా ఇప్పటివరకు పార్క్‌ ఏర్పాటు కాలేదన్నారు. అలాగే 2009లో పాలకుర్తి, చెన్నూరు రిజర్వాయర్ల పనులకు రూ.370 కోట్లతో ప్రతిపాదనలు చేసి 2021లో ప్రారంభించినా.. నిధుల కొరతతో అసంపుర్ణంగా వదిలేశారని చెప్పారు. జిల్లా కేంద్రంలో పాలిటెక్నిక్‌ ఏర్పాటు హామీ కలగానే మిగిలిందని.. వీటి సాధనకు తమ పార్టీ ఆందోళనలు చేపడుతున్నదని పేర్కొన్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యు డు కేవీఎల్‌ఎన్‌.రెడ్డి, ఉడుగుల రమేశ్‌, శివరాజ్‌, ఎల్లయ్య, శ్రీనివాస్‌, లక్ష్మీనరసయ్య, మహిపా ల్‌, నవీన్‌రెడ్డి, రవి, జగదీష్‌ పాల్గొన్నారు.

‘ముసాయిదాను

వెనక్కి తీసుకోవాలి’

కేయూ క్యాంపస్‌: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి న యూజీసీ నూతన ముసాయిదాను వెనక్కి తీసుకోవాలని టీపీటీఎఫ్‌ రాష్ట్ర పూర్వ కార్యదర్శి కడారి భోగేశ్వర్‌ డిమాండ్‌ చేశారు. శనివా రం పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో.. కేయూ దూర విద్యాకేంద్రంలో నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్సిటీల కు నిధులు సమకూర్చేందుకు ఏర్పడిన(యూజీసీ) యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసేలా నూతన నిబంధనలతో ముసాయి దాను రూపొందించిందన్నారు. పీడీఎస్‌యూ, ఎస్‌ఎఫ్‌ఐ, బీసీ విద్యార్థి సంఘం నాయకులు పి.మహేశ్‌, శ్రీకాంత్‌, నాగరాజు పాల్గొన్నారు.

టేబుల్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌కు ఎంపిక1
1/2

టేబుల్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌కు ఎంపిక

టేబుల్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌కు ఎంపిక2
2/2

టేబుల్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌కు ఎంపిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement