గొల్లపల్లి: మండలంలోని వెన్గుమట్ల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీనివాసుడి కల్యాణం ఘనంగా నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి కల్యాణం కన్నులపండువగా జరిగింది. గోవింద నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆలయ నిర్వాహకులు చర్యలు చేపట్టారు. అన్నప్రసాదవితరణ, తీర్థప్రసాద చేశారు. కార్యక్రమంలో సర్పంచులు శిరీష, నక్క స్రవంతి, ఎల్లాల గోపాల్రెడ్డి, ఎల్లాల నారాయణరెడ్డి, కనపర్తి దామోదర్రావు, ద్యావనంది రాజేశ్వర్, ఆవునూరి శ్రీధర్, ద్యావనంది జలేందర్ పాల్గొన్నారు.


