హోరాహోరీగా వాలీబాల్ పోటీలు
ధర్మారం(ధర్మపురి): ధర్మారం మండలం నందిమేడారం బాలుర గురుకుల విద్యాలయంలో జరుగుతున్న 69వ ఎస్జీఎఫ్ అండర్– 14 రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో గురువారం బాలబాలికలు హోరాహోరీగా తలపడ్డారు. రాష్ట్రంలోని పది జిల్లాల నుంచి 244 మంది క్రీడాకారులు పోటీలకు హాజరయ్యారు. కాగా ఈనెల 28 వరకు జరిగే పోటీలను తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చారు. జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి సురేశ్, ఎంఈవో ప్రభాకర్, ప్రిన్సిపాల్ విద్యాసాగర్, వాలీబాల్ సంఘం అధ్యక్షుడు ముత్యాల రవీందర్, కార్యదర్శి తమ్మడవేని రాజయ్య, ఎస్జీఎఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి లక్ష్మణ్, క్రీడల పరిశీలకులు బాలు, మల్లేశ్, వ్యాయామ ఉపాధ్యాయులు కొమురయ్య, కుమార్, సౌజన్య, ఖాదర్ తదితరులు పాల్గొన్నారు.


