
2,426 కేసుల పరిష్కారం
జగిత్యాలజోన్: లోక్ అదాలత్లో భాగంగా జిల్లాలోని వివిధ కోర్టుల్లో 2,426 కేసులను పరిష్కరించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్న పద్మావతి తెలిపారు. జిల్లాకేంద్రంలో లోక్అదా లత్ ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. 50 సివిల్ కేసులు, 2,324 క్రిమినల్ కేసులు, 52 ప్రిలిటిగెంట్ కేసులు పరిష్కరించినట్లు పేర్కొన్నా రు. 20 మోటార్ వాహనాల కేసుల్లో రూ.1.45 కోట్ల పరిహారం ఇప్పించినట్లు తెలిపారు. లోక్అదాలత్ తీర్పులు సుప్రీంకోర్టు తీర్పుతో సమానమన్నారు. కేసులతో ఇబ్బంది పడే బదులు రాజీ చేసుకోవడం మేలన్నారు. జిల్లా మొదటి అదనపు జడ్జి నారాయణ, న్యాయ సేవా సంస్థ కార్యదర్శి, సబ్ జడ్జి వెంకట మల్లిక్ సుబ్రహ్మణ్య శర్మ, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఆర్.లావణ్య, మొదటి అదనపు జుడిషియల్ మేజిస్ట్రేట్ శ్రీనిజ, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ చీఫ్ చంద్రమోహన్, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ సతీష్, విజయ్కుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీరాములు, ప్రధాన కార్యదర్శి మారుతి ఉన్నారు.