బస్సు బోల్తా, 13 మంది మృతి
టెహ్రాన్: మధ్య ఇరాన్లో ఒక ప్రయాణికుల బస్సు బోల్తా పడిన ఘటనలో 13 మంది మరణించారు, పది మందికి పైగా గాయపడ్డారు. ఈ విషయాన్ని ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఐఆర్ఎన్ఏ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. సోమవారం ఆలస్యంగా ఇస్ఫాహాన్ నుండి ఈశాన్య నగరమైన మషాద్కు బస్సు ప్రయాణిస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది.
బస్సు హైవే మధ్యలో ఉన్న సెంట్రల్ గార్డ్ రైల్ను ఢీకొని, ఎదురు లేన్లోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత ఒక టాక్సీని ఢీకొని బోల్తా పడినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంలో బస్సులోని 11 మంది ప్రయాణికులు, టాక్సీలో ఉన్న ఇద్దరు వ్యక్తులు.. మొత్తం 13 మంది మరణించారు.


