ప్రధాని మోదీని స్వాగతించిన చైనా | China Welcomes PM Narendra Modi Visit to Attend SCO Summit in Tianjin | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీని స్వాగతించిన చైనా

Aug 9 2025 6:07 AM | Updated on Aug 9 2025 6:07 AM

China Welcomes PM Narendra Modi Visit to Attend SCO Summit in Tianjin

బీజింగ్‌:  ప్రధాని మోదీ త్వరలో చైనాలో పర్యటించబోతున్నారు. ఈ నెల 31న, వచ్చే నెల 1న చైనాలో జరిగే షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) సదస్సులో ఆయన పాల్గొంటారు. ఈ నేపథ్యంలో ఎస్సీఓ సదస్సుకు నరేంద్ర మోదీని స్వాగతిస్తున్నట్లు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గుయో జియాకున్‌ శుక్రవారం పేర్కొన్నారు. 

ఈ సదస్సు భాగస్వామ్యపక్షాలకు స్నేహపూర్వక, ఫలవంతమైన ఫలితాలను ఇస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఎస్సీఓ సభ్యదేశాలతోపాటు మొత్తం 20 దేశాల అధినేతలు సదస్సులో పాల్గొంటారని వెల్లడించారు.    
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement