
మాస్కో: రష్యాలో ఘోర రైలు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. శనివారం రాత్రి రైల్వే బ్రిడ్జి కూలిపోవడంతో ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతిచెందగా.. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. పలువురు ప్రయాణికులు ప్రాణ భయంతో పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
వివరాల ప్రకారం.. రష్యాలోని బ్రయాన్స్క్ ప్రాంతంలో శనివారం రాత్రి వంతెన కూలిపోయింది. అదే సమయంలో ప్యాసింజర్ రైలు వెళ్తున్న కారణంగా సదరు రైలు ప్రమాదానికి గురైంది. ఉక్రెయిన్ సరిహద్దుకు సమీపంలోని రష్యాలోని బ్రయాన్స్క్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని రష్యా అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించగా, దాదాపు 30 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
⚡ BREAKING
Russian Emergency crews are cutting through metal train cars to rescue trapped passengers.
The Klimov–Moscow train was crushed after the blast, caused by the detonation of a bridge support in the Vygonichsky district of Russia’s Bryansk region.#Russia #Bryansk https://t.co/X6oD1mZJUk pic.twitter.com/RZoahsb4wC— ⚡𝙉𝙊𝙄𝙎𝙀 𝘼𝙇𝙀𝙍𝙏𝙎 (@NoiseAlerts) May 31, 2025
ఈ సందర్భంగా బ్రయాన్స్క్ ప్రాంతీయ గవర్నర్ అలెగ్జాండర్ బొగోమాజ్ మాట్లాడుతూ.. రైలు ప్రమాదం నేపథ్యంలో అత్యవసర సేవలు, ప్రభుత్వ అధికారులు సంఘటన స్థలంలో సహాయక చర్యలు చేపట్టారని తెలిపారు. మృతిచెందిన వారిలో రైలు లోకో పైలట్ కూడా ఉన్నారు. ప్యాసింజర్ రైలు మాస్కో నుండి క్లిమోవ్కు వెళుతోందని అన్నారు.
BREAKING: Multiple dead and wounded after bridge collapses onto passenger train in Russia's Bryansk region, according to Baza
Sabotage is suspected pic.twitter.com/S4v4c0aXfJ— Faytuks News (@Faytuks) May 31, 2025
అయితే, గత మూడేళ్లుగా రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. బ్రయాన్స్క్ ప్రాంతం రష్యా, ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉండటంతో డ్రోన్ దాడులు, బాంబు దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలోనే దాడుల ప్రభావంతో వంతెన కూలిపోయినట్టు స్థానికులు చెబుతున్నారు.