రాయదుర్గం: మారుతున్న ఆహారపు అలవాట్లు పోషక లోపాలకు దారితీస్తున్నాయని సినీ నిటీ శ్రియా శరణ్ పేర్కొన్నారు. నగరంలోని నాలెడ్జి సిటీలో ఐటీసీ కోహినూర్లో శ్రియా శరణ్ గురువారం సందడి చేశారు. భారతదేశపు తొలి పోర్టిఫైడ్ ప్రోటీన్ ప్లస్ మల్టిగ్రేన్ ఆటా ‘మినార్’ను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూఫోర్టిఫైడ్ ఆహారం ఈ లోపాలను తగ్గించి, ఆరోగ్యాన్ని మెరుగు పర్చడంలో కీలకపాత్ర పోషిస్తుందన్నారు. ప్రజలంతా నాణ్యమైన వస్తువులను వినియోగించు కోవాలని సూచించారు. చెఫ్ సంజయ్తుమ్మ, డాక్టర్ ప్రభా అగర్వాల్,సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
సినీనటి శ్రియా శరణ్


