పుస్తకాలు, పత్రికలు చదవండి | - | Sakshi
Sakshi News home page

పుస్తకాలు, పత్రికలు చదవండి

Aug 21 2025 11:08 AM | Updated on Aug 21 2025 11:08 AM

పుస్తకాలు, పత్రికలు చదవండి

పుస్తకాలు, పత్రికలు చదవండి

విద్యార్థులకు హైడ్రా కమిషనర్‌ సూచన

ఉస్మానియా యూనివర్సిటీ: విద్యార్థులు ప్రతిరోజూ పుస్తకాలు, దిన పత్రికలను చదడం అలవాటుగా చేసుకోవాలని హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ అన్నారు. బుధవారం ఓయూ క్యాంపస్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో మొదటి సంవత్సరం అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు ఓరియంటేషన్‌ డే నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన రంగనాథ్‌ మాట్లాడుతూ విద్యార్థులు సమయాన్ని వృధా చేయకుండా, చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ సానుకూల థృక్పథంతో భవిష్యత్‌కు మంచి పునాదులు వేసుకోవాలని సూచించారు. ఓయూ వీసీ ప్రొ.కుమార్‌ మాట్లాడుతూ ఇంజినీరింగ్‌ విద్యార్థులు క్రమం తప్పకుండ తరగతులకు హాజరుకావాలన్నారు. విద్యార్థుల జీవితంలో 90 శాతం విజయం కష్టపడి పని చేయడం వల్ల, 5 శాతం స్మార్ట్‌ వర్క్‌, 5 శాతం నెట్‌ వర్కింగ్‌ వల్ల లభిస్తుందన్నారు. సోషల్‌ మీడియాపై ఆధారపడకుండ పుస్తకాలను చదవడం అలవాటుగా పెట్టుకోవాలని విద్యార్థులకు చూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ ప్రొ.చంద్రశేఖర్‌, ఇంజినీరింగ్‌ విభాగం సీనియర్‌ డైరెక్టర్‌ సుమన్‌ సిన్హా, ఇంజినీరింగ్‌ డీన్‌ ప్రొ.ఎ.కృష్ణయ్య, వైస్‌ ప్రిన్సిపాల్‌ ప్రొ.మంగు తదితరులు పాల్గొని ప్రసంగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement