కేయూ క్యాంపస్ : తెలంగాణా రాష్ట్ర ఉద్యమకారుల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓను స్వాగతిస్తూ ఆదివారం కాకతీయ యూనివర్సిటీ మొదటిగేట్వద్ద కాంగ్రెస్ నాయకులు, నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ మేడారపు సుధాకర్ ఇతర బాధ్యులు కలిసి సీఎం రేవంత్రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్ర సాధన కోసం నిరంతరం పోరాడిన ఉద్యమకారులను గుర్తింపునకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయటం స్వాగతిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో నిరుద్యోగ జేఏసీ బాధ్యులు గనిపాక క్రాంతికుమార్, సుధగాని మధు, అరుణ్కుమార్, రవి, సాయి, వెంకటేష్, అన్వేష్, రాజ్కుమార్, కుమారస్వామి, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.


