కేయూ క్యాంపస్ : కాకతీ య యూనివర్సిటీలోని ప రిపాలనా భవనంలోని మొదటి అంతస్తులో నూతనంగా ఆధునికీకరించిన ఆఫీస్ను రిజిస్ట్రార్ ప్రొఫె సర్ వి.రామచంద్రం సో మవారం ప్రారంభించారు. పాత వీసీ చాంబర్ను ఆధునీకరించగా అందులోనికి రిజిస్ట్రార్ చాంబర్, పేషీగా మార్చారు. ఇక నుంచి ఈ ఆ ఫీస్లోనే రిజిస్ట్రార్ బాధ్యతలు నిర్వర్తించబోతున్నారు. ప్రస్తుతం ఉన్న రిజిస్ట్రార్ చాంబర్, పేషీని ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ) ఇటీవలే నియమితులైన వెంకట్రామ్రెడ్డికి కేటాయించారు. వీసీ ప్రొఫెసర్ కె.ప్రతాప్రెడ్డి ఆయా చాంబర్లకు వెళ్లి రిజిస్ట్రార్కు, వెంకట్రామ్రెడ్డికి పూలబోకేల ను అందజేసి అభినందించారు.


