
దైవదర్శనానికి వెళ్లొస్తూ అనంతలోకాలకు..
మహబూబాబాద్ రూరల్/శాలిగౌరారం : శ్రీశైలం మల్లికార్జునస్వామి వారి దైవదర్శనానికి వెళ్లొస్తూ ఓ వ్యక్తి అనంతలోకాలకు చేరాడు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తాపడిన ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన 365వ నంబర్ జాతీయ రహదా రిపై నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం మా ధారంకలాన్ గ్రామం వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగింది. ఈ ప్రమాదంతో మహబూబా బాద్ జిల్లా కేంద్రంలోని బాబునాయక్ తండా, వినా యక తండా, పత్తిపాక ప్రాంతాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానికులు, శాలిగౌరారం ఎస్సై సైదులు కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయకతండా, బాబు నాయక్ తండా, పత్తి పాక ప్రాంతాలకు చెందిన 14 మంది తాపీ మేసీ్త్రలు ఆదివారం ఉదయం ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో శ్రీశైలం మల్లికార్జునస్వామివారి దర్శనా నికి వెళ్లారు. దర్శనం అనంతరం వీరు తిరిగి స్వగ్రామానికి వస్తుండగా.. డ్రైవర్ గుండెపాక నవీన్ అతివేగం, అజాగ్రత్తగా నడుపుతూ 365వ నంబర్ జాతీయ రహదారిపై శాలిగౌరారం మండలం మాధారంకలాన్ గ్రామం వద్ద రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ఆటోను ఢీకొట్టాడు. దీంతో ట్రావెల్స్ బస్సు రహదారి పక్కన ఉన్న పంట పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న బానోత్ మంగీలాల్(42) తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. బానోత్ రమేశ్, బానోత్ లాలు, భూక్య సర్వం, అంబోతు శ్రీను, గుగులోత్ నరేశ్, భూక్య వీరన్కు తీవ్రగాయాలు కాగా.. మరో ఏడుగురికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం తెలిసిన వెంటనే వారి కుటుంబీకులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను నల్లగొండ, నకిరేకల్, హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు. తీవ్రంగా గాయపడిన లచ్చిరాం, నరేశ్ మహబూబాబాద్కు తరలించి ఓ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై మృతుడి భా ర్య పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు ఎస్సై సైదులు తెలిపారు.
బోల్తా పడిన ట్రావెల్స్ బస్సు.. ఒకరి మృతి
13 మందికి తీవ్ర గాయాలు
నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలంలో ఘటన