రోణంకి కూర్మనాథ్
కొరిటెపాడు(గుంటూరు): వినియోదారుల సమస్యల సత్వర పరిష్కారానికి విద్యుత్ అదాలత్ ఎంతగానో ఉపయోపడుతోందని కన్జ్యూమర్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ ఫోరం(సీజీఆర్ఎఫ్) చైర్మన్ ఎన్.విక్టర్ ఇమ్మానుయేలు అన్నారు. గుంటూరు పొన్నూరు రోడ్లోని విద్యుత్ భవనం ఆవరణలోని సమావేశ మందిరంలో శనివారం విద్యుత్ వినియోగదారుల అదాలత్, అవగాహన సదస్సు నిర్వహించారు. వినియోగదారుల నుంచి వినతులు స్వీకరించారు. విద్యుత్ బిల్లుల్లో తప్పులు, స్తంభాల మార్పు, మీటర్ రీడింగ్లో లోపాలు, కొత్త కనెక్షన్ల జాప్యం, లో–ఓల్టేజీ, సోలిర్ పేమెంట్ క్రెడిట్ కాకపోవడం తదితర సమస్యలపై 12 వినతులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. సీజీఆర్ఎఫ్ చైర్మన్ ఇమ్మానియేలు మాట్లాడుతూ వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి వివరాలతో స్పాట్లోనే పరిష్కారానికి చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. అదాలత్కు వచ్చిన 12 ఫిర్యాదుల్లో 10 పరిష్కరించినట్లు తెలిపారు. వినియోగదారుల హక్కులు, విద్యుత్ చట్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సీజీఆర్ఎఫ్ సాంకేతిక సభ్యులు డి.కృష్ణనాయక్, ఆర్థిక సభ్యులు కె.కృష్ణ, స్వతంత్ర సభ్యులు ఏ.సునీత, ఎస్ఈ చల్లా రమేష్, అకౌంటెంట్ రామిరెడ్డి, డీఈఈలు, ఏఈలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నరసరావుపేట: అమృత భారత్ స్టేషన్ స్కీము(ఏబీఎస్ఎస్) కింద కోట్ల వ్యయంతో చేస్తున్న రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులను గుంటూరు రైల్వే డివిజనల్ మేనేజర్ సుధేష్ణసేన్ శనివారం పరిశీలించారు. స్టేషన్లో నూతనంగా ఏర్పాటుచేసిన రెండో ప్లాట్ఫామ్ పైకప్పు, ప్లోర్ పనులు, మొదటి ప్లాట్ఫామ్ పొడిగింపు, హైలెవల్ బ్రిడ్జి, స్టేషన్ ముందు పనులను పరిశీలించారు. ఈనెలాఖరుకు ప్లాట్ఫామ్ పనులను పూర్తిచేస్తామని ఇంజినీర్లు చెప్పారు. లింగంగుంట్ల వైపు స్టేషన్సమీపంలో నివాసం ఉంటున్న గృహాలను పరిశీలించారు. నూతన రైల్వేట్రాక్, స్టేషన్ కొలతలను కొలిపించి పరిశీలించారు. అసిస్టెంట్ డీఆర్ఎం రమేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.


