స్వచ్ఛతపై అవగాహన కలిగి ఉండాలి | - | Sakshi
Sakshi News home page

స్వచ్ఛతపై అవగాహన కలిగి ఉండాలి

Mar 29 2026 7:20 AM | Updated on Mar 29 2026 7:20 AM

● ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సమాజం బాగుండాలంటే విద్యార్థులు మంచి విషయాలు నేర్చుకుని, వాటిని జీవితంలో పాటించాలన్నారు. స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా జీరో వేస్ట్‌ ఇనిష్టిట్యూట్‌ అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ● ప్రతి నెల జరిగే ఈ కార్యక్రమంలో జిల్లాలో సుమారు 3 లక్షల మంది పాల్గొని స్వచ్ఛతపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. ప్రజల భాగస్వామ్యం ఉంటేనే ప్రభుత్వ పథకాలు విజయవంతమవుతాయన్నారు. ● విద్యార్థులు వ్యర్థాల విభజన, నిర్వహణతో పాటు పచ్చదనం పెంపు, విద్యుత్‌ పొదుపు, నీటి సంరక్షణకు ముందుకు రావాలన్నారు. అధ్యాపకులు, ఉపాధ్యాయులు కూడా పుస్తకాల చదువుతో పాటు సమాజ శ్రేయస్సుకు విద్యార్థులు చొరవ చూపేలా కృషి చేయాలన్నారు. అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్‌ ఎ.తమీమ్‌ అన్సారియా

గుంటూరు రూరల్‌: స్వచ్ఛతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్‌ ఎ. తమీమ్‌ అన్సారియా తెలిపారు. శనివారం పెదపలకలూరు రోడ్డులోని విజ్ఞాన్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో నగర కమిషనర్‌ కె. మయూర్‌ అశోక్‌తో కలిసి పాల్గొన్నారు.

కులం పేరుతో దూషణపై కేసు నమోదు

తెనాలి రూరల్‌: కులం పేరుతో దూషణపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదైంది. దళితుల్లోని రెండు సామాజికవర్గాలను అసభ్యంగా దూషిస్తూ మండలంలోని ఖాజీపేట గ్రామానికి చెందిన చల్లా నాగరాజు శుక్రవారం ఫేస్‌బుక్‌లో లైవ్‌ వీడియో పెట్టాడు. తిరిగి రాత్రి క్షమాపణ కోరుతూ మరో లైవ్‌ వీడియో పోస్టు చేశాడు. దీనిపై రూరల్‌ పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. ఇప్పటికే నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement