
ఆర్మీ మేజర్కు ఘన నివాళి
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): డాక్టర్ స్వామినాథన్ సిఫారసుల ప్రకారం క్వింటా పత్తికి రూ.10,073 ధర నిర్ణయించి కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య, గుంటూరు జిల్లా కౌలు రైతుల సంఘం ప్రధాన కార్యదర్శి పి.వి. జగనాదం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గుంటూరు కొత్తపేటలోని సీపీఐ జిల్లా కార్యాలయంలోని మల్లయ్య లింగంభవన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పత్తి కొనుగోలులో వ్యాపారస్తులు సిండికేట్గా మారి కేంద్రం ప్రకటించిన మద్దతు ధర కూడా దక్కనివ్వడం లేదన్నారు. క్వింటా పత్తిని రూ.5 వేలలోపునకు కొనుగోలు చేసి రైతుల శ్రమను దోచుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని కనీస మద్దతు ధర రూ.7,710 ప్రకారమైనా కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
తండ్రి మందలించాడని..
ఇంటి నుంచి వెళ్లిపోయిన కొడుకు
కారంచేడు: తండ్రి మందలించినందుకు కొడుకు అలిగి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. బంధువులు, స్నేహితుల వద్ద విచారించినా కనపడకపోవడంతో పోలీసులకు బుధవారం తండ్రి ఫిర్యాదు చేశాడు. కారంచేడు ఎస్ఐ షేక్ ఖాదర్బాషా తెలిపిన వివరాలు.. మండలంలోని తిమిడెదపాడు గ్రామానికి చెందిన తమ్మల ప్రసాద్కు ముగ్గురు సంతానం కాగా ఇద్దరికి వివాహాలు చేశాడు. మూడో కుమారుడైన జయప్రకాశ్ ఈనెల 14వ తేదీ ఉదయం 10 గంటల నుంచి కనిపించకుండా పోయాడు. ఐటీఐ పూర్తి చేసిన జయప్రకాశ్ కొన్ని రోజులు హైదరాబాద్లో ఉండి ఉద్యోగం చేశాడు. తనకు బెంగగా ఉందని ఇంటికి రమ్మని తండ్రి కోరడంతో తిరిగి ఇంటికి వచ్చాడు. అయితే వచ్చిన దగ్గర నుంచి ఏ పనికీ వెళ్లకుండా ఇంటి వద్దనే ఉండటంతో తండ్రి మందలించి పనులు చేసుకోవాలని సూచించాడు. దీంతో అతను అలిగి పారిపోయాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.