అంబులెన్స్‌కు ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

అంబులెన్స్‌కు ప్రమాదం

Mar 19 2026 7:54 AM | Updated on Mar 19 2026 7:54 AM

నరసాపురం రూరల్‌: పసికందును అత్యవసర చికిత్స నిమిత్తం తరలిస్తున్న అంబులెన్స్‌ ఆవును ఢీకొంది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సయ్యద్‌ హమీద్‌ మౌలా ఖాదీ, సయ్యద్‌ మహబూబ్‌ సుల్తానా దంపతులకు జనవరి 30న ఒక బాబు జన్మించాడు. ఆ బాబుకు గుండె సంబంధిత సమస్య ఉండటంతో ఆపరేషన్‌ నిమిత్తం తిరుపతి పద్మావతి ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స అనంతరం, బాబు పరిస్థితి మెరుగుపడకపోవడంతో వైద్యుల సూచన మేరకు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో బాబును అంబులెన్స్‌లో కాకినాడ తరలిస్తుండగా మార్గమధ్యలో బుధవారం వేకువజామున మొగల్తూరు మండలం కొత్తోట గ్రామానికి వచ్చేసరికి జాతీయ రహదారిపై అడ్డుగా ఉన్న ఆవును అంబులెన్స్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అంబులెన్స్‌ ముందుబాగం పూర్తిగా దెబ్బతిన్నప్పటికీ అంబులెన్స్‌లో ఉన్న వారంతా క్షేమంగా బయటపడ్డారు. బాబును 108 అంబులెన్స్‌లోకి మార్చి సురక్షితంగా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాబు క్షేమంగా ఉన్నాడని, కాకినాడ ఆసుపత్రిలో తదుపరి వైద్యం అందుతోందని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement