14 నుంచి ‘నన్నయ’లో ఫుడ్‌ ఫెస్టివల్‌ | - | Sakshi
Sakshi News home page

14 నుంచి ‘నన్నయ’లో ఫుడ్‌ ఫెస్టివల్‌

Oct 7 2025 4:21 AM | Updated on Oct 7 2025 4:21 AM

14 నుంచి ‘నన్నయ’లో ఫుడ్‌ ఫెస్టివల్‌

14 నుంచి ‘నన్నయ’లో ఫుడ్‌ ఫెస్టివల్‌

రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీ ప్రాంగణంలో మూడు రోజుల పాటు జరిగే మెగా ఫుడ్‌ ఫెస్టివల్‌ ఈ నెల 14 నుంచి ప్రారంభమవుతుందని వీసీ ఆచార్య ఎస్‌.ప్రసన్నశ్రీ తెలిపారు. యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలోని ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగానికి చెందిన అధ్యాపకులతో సోమవారం ఈ అంశంపై చర్చించారు. ఈ నెల 16న ప్రపంచ ఆహార దినోత్సవాన్ని పురస్కరించుకుని, గోదావరి రుచులను, అభిరుచులను తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. ఆహార పదార్థాల తయారీలో చేయితిరిగిన ఔత్సాహికులు ఈ కార్యక్రమంలో పాల్గొని, తమ ప్రతిభను చాటాలన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ఆచార్య కేవీ స్వామి, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పి.విజయనిర్మల, హెచ్‌ఓడీ ఆచార్య డి.కల్యాణి, అధ్యాపకులు ఎంఎం కృష్ణవేణి, కె.సింధూజ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement