జాతీయ స్థాయి బాక్సింగ్‌ పోటీలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

జాతీయ స్థాయి బాక్సింగ్‌ పోటీలకు ఎంపిక

Jun 16 2025 5:45 AM | Updated on Jun 16 2025 5:45 AM

జాతీయ స్థాయి బాక్సింగ్‌  పోటీలకు ఎంపిక

జాతీయ స్థాయి బాక్సింగ్‌ పోటీలకు ఎంపిక

పిఠాపురం: జాతీయ స్థాయి బాక్సింగ్‌ పోటీలకు పిఠాపురం క్రీడాకారిణి ఎంపికై నట్లు కోచ్‌ పి.లక్ష్మణరావు ఆదివారం తెలిపారు. స్థానికంగా ఆయన మాట్లాడుతూ మే నెల 30, 31వ తేదీల్లో విశాఖపట్నంలో జరిగిన రాష్ట్ర స్థాయి జూనియర్‌ బాలికల బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో 80+ కిలోల విభాగంలో పిఠాపురానికి చెందిన జె.ఐశ్వర్య సూర్యదీపిక రజిత పతకం సాధించిందన్నారు. అదే పోటీల్లో విజయనగరానికి చెందిన బాక్సర్‌ స్వర్ణ పతకం సాధించింది. ఆమె జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ంది. అనివార్య కారణాలతో విజయనగరం బాక్సర్‌ పోటీల నుంచి తప్పుకుంది. దీంతో తరువాత స్థానంలో ఉన్న పిఠాపురం బాక్సర్‌ ఐశ్వర్య సూర్యదీపికకు ఈ అవకాశం దక్కిందన్నారు. ఈ నెల 19 నుంచి 26 తేదీ వరకు హర్యానా రాష్ట్రం రోతక్‌లో జరగనున్న జాతీయ స్థాయి 6వ జూనియర్‌ బాలికల బాక్సింగ్‌ పోటీలకు పిఠాపురం నుంచి ఆంధ్రప్రదేశ్‌ జట్టు తరఫున సూర్యదీపిక పాల్గొంటుందని కోచ్‌ వివరించారు. ఈ సందర్భంగా ఆమెను డిస్ట్రిక్ట్‌ స్పోర్ట్స్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ బి.శ్రీనివాస్‌కుమార్‌, ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఐ.వెంకటేశ్వరరావు, కె.పద్మనాభం అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement