గణపయ్యో గైకొనవయ్యా నైవేద్యాలు! | - | Sakshi
Sakshi News home page

గణపయ్యో గైకొనవయ్యా నైవేద్యాలు!

Sep 27 2023 2:44 AM | Updated on Sep 27 2023 2:44 AM

మొగలికుదురులో కరెన్సీతో వినాయకునికి అలంకరణ     - Sakshi

మొగలికుదురులో కరెన్సీతో వినాయకునికి అలంకరణ

మామిడికుదురు: గణపతి నవరాత్ర వేడుకల్లో భాగంగా ఆదుర్రు శివారు మోరిపొలంలో విఘ్నేశ్వరునికి 190 రకాల వంటకాలు నివేదించారు. గణేష్‌ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. 108 శివలింగాలకు అర్చన, జ్యోతిర్లింగార్చన ఘనంగా జరిగాయి. పలువురు భక్తులు ఈ పూజల్లో పాల్గొన్నారు. మొగలికుదురు జున్నూరి నగర్‌లో ఏర్పాటు చేసిన పృథ్వీ గణపతిని రూ.50 వేల విలువైన కరెన్సీ నోట్లతో అలంకరించారు. 100, 50, 20 నోట్లతో గణపతి మంటపాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement