వాడపల్లిలో అన్నదానం స్వీకరించడానికి తాత్కాలిక షెడ్డులో ఇబ్బందులు పడుతున్నాం. పిల్లాపాపలతో ఇక్కడ భోజనం చేయడం కష్టంగా ఉంది. శాశ్వత భవనాన్ని అన్ని వసతులతో నిర్మించాలని కోరుతున్నాం.
– లొల్ల పద్మలత. హైదరాబాద్
భోజనం చేయడానికి ఇబ్బంది
ఎంతో దూరం నుంచి ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించుకున్నాం. కానీ కూర్చుని భోజనం చేయడానికి ఇక్కడే అనుకూలంగా లేదు. ముఖ్యంగా మహిళలు, పిల్లలు భోజనం చేయడం కష్టంగా ఉంది.
– ముర్ల కుమారి, నర్సీపట్నం
త్వరలో శాశ్వత భవనాన్ని ప్రారంభిస్తాం
ఆలయానికి భక్తులు లక్షల సంఖ్యలో వస్తున్నారు. అన్నదానం స్వీకరించడంలో వారి ఇబ్బందులను గుర్తించాం. వకుళమాత శాశ్వత అన్నదాన భవనం నిర్మాణ పనులు తొందరలో పూర్తి చేసి ఆగస్టు నెలలో ప్రారంభించానికి కృషి చేస్తున్నాం.
– నల్లం సూర్య చక్రధరరావు, ఈవో


