మైనర్‌ బాలికపై టీడీపీ నేతల సామూహిక అత్యాచారం | TDP Leaders in Serious Case Involving Girl | Sakshi
Sakshi News home page

మైనర్‌ బాలికపై టీడీపీ నేతల సామూహిక అత్యాచారం

Jun 6 2025 8:25 PM | Updated on Jun 6 2025 8:56 PM

TDP Leaders in Serious Case Involving Girl

రామగిరి:  శ్రీ సత్యసాయి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలో టీడీపీ నేతల కీచక పర్వం తాజాగా వెలుగులోకి వచ్చింది. మైనర్‌ బాలికపై టీడీపీ నేతలు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ ఘటన సంచలనంగా మారింది. రామగిరిమండలం ఏడుగురాకలపల్లిలో  ఓ మైనర్‌ బాలికను ప్రేమ పేరుతో ట్రాప్‌ చేశాడు టీడీపీ నేత.  ఈ క్రమంలోనే  ఆ బాలికను లోబర్చుకుని నగ్న దృశ్యాలు చిత్రీకరించారు.   

ఆపై ఆ బాలికను బ్లాక్‌ మెయిల్‌ చేసి పలువురు టీడీపీ నేతలు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. దీనిపై ఆ బాలిక కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటపడింది. దీనిపై ఆ బాధిత కటుంబంతో పాట దళిత సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఆ మైనర్‌ బాలికపై అత్యాచారానికి పాల్పడిన టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement