దారుణం: చెట్టుకింద నిద్రిస్తున్న వ్యక్తిపై మట్టి డంప్‌

Sleeping Man Footpath Deceased Negligence Lorry Driver In Madhapur - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  డ్రైవర్‌ నిర్లక్ష్యం ఓ వ్యక్తి ప్రాణాన్ని బలి తీసుకుంది. నిద్రిస్తున్న వ్యక్తిపై మట్టిన డంప్‌ చేయడంతో అతను మృతి చెందాడు. ఈ ఘటన మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. రాజస్థాన్‌కు చెందిన రామ్‌నరేశ్‌(32) జయభేరి కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలో కూలీగా పనిచేస్తూ కంపెనీకి చెందిన ఓ షెడ్‌లో నివాసముంటున్నాడు.

ఈనెల 16న రాత్రి 10.30 గంటల సమయంలో షెడ్‌ సమీపంలోని ఓ చెట్టుకింద రామ్‌నరేశ్‌ నిద్రిస్తుండగా  అది గమనించని టిప్పర్‌ సిబ్బంది మట్టిని అతనిపై డంప్‌ చేశారు. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. భార్య ఫిర్యాదు మేరకు కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ యాజమాన్యంపై కేసును నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు. 
( చదవండి:  ఏం జరిగిందో...తల్లి లేచే చూసేసరికి..)
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top