‘ఇష్టపడి పెళ్లి, ఇష్టపడే ఆత్మహత్య చేసుకుంటున్నా.. క్షమించు అమ్మా’

Newly Married Software Techie Suicide Karnataka - Sakshi

యశవంతపుర(బెంగళూరు): నవ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరులో జరిగింది. చిక్కమగళూరు జిల్లా చోళనహళ్లికి చెందిన అంజు (26) ఒక సాఫ్ట్‌వేర్‌ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. నాలుగు నెలల క్రితం అంజన్‌ కణియార్‌ అనే వ్యక్తిని ప్రేమించి, పెద్దలను ఒప్పించి వివాహం చేసుకొంది. అంజన్‌ది హాసన్‌ కాగా, బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. శనివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో అంజు బెడ్‌రూంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొంది. భర్త ఆఫీసు నుంచి ఇంటికి వచ్చి చూడగా ఉరికి వేలాడుతూ కనిపించింది.
చదవండి: వాంగ్మూలం ఇస్తేనే కేసా..? జూబ్లీహిల్స్‌ గ్యాంగ్‌రేప్‌ కేసులో పోలీసుల తీరుపై విమర్శలు

ఇష్టపడే చనిపోతున్నానని డెత్‌నోట్‌
ఆమె రాసిన డెత్‌నోట్‌ను పోలీసులు కనుగొన్నారు. ఇష్టపడి పెళ్లి చేసుకున్నా, ఇష్టపడే ఆత్మహత్య చేసుకొంటున్నాను క్షమించు అమ్మా అని రాసి ఉంది. నా మనస్థితి సరిగా లేదు. నేను ఏమి చేస్తున్నానో నాకే తెలియడం లేదు. వెన్ను నొప్పిగా ఉంది అని రాసింది. అత్తింటివారు కట్నం కోసం వేధిస్తున్నట్లు తల్లి హేమావతికి తరచూ చెప్పేదని సమాచారం. భర్త, అత్తమామల వేధింపులతోనే తన కూతురు ఆత్మహత్య చేసుకున్నట్లు మంజు తల్లిదండ్రులు అరోపించారు. సుబ్రమణ్యనగర పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top